Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దిశ ఘటనపై స్పందించిన ‘మా’.. గవర్నర్కి విన్నపం
హైదరాబాద్లో జరిగిన దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. డాక్టర్ ప్రియాంక హత్యోదంతంపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమాజం మొత్తం వ్యతిరేకంగా నిలబడగా.. నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నివైపుల నుంచి నినాదాలు వినిపిస్తున్నాయి. ఆ ఘటనకు కారకులైన దోషులకు మరణదండన విధించాలని సమాజం మొత్తం ఆగ్రహజ్వాలలు ఎగిసి పడుతున్నాయి.
దిశ హత్యచారం లాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని, దిశకు జరిగిన అన్యాయం వేరొకరికి జరగకూడదని, ఈ కేసుపై వేగంగా దర్యాప్తు జరిపి తొందరగా దోషులకు శిక్ష పడేలా చేయాలని కోరుతూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ని మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ప్రతినిధులు కలిశారు. మా జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్.. ఉపాధ్యక్షురాలు హేమ.. అనిత చౌదరి.. జయలక్ష్మి తనీష్, సురేష్ కొండేటి.. ఏడిద శ్రీరామ్.. రవి ప్రకాష్ తదితరులు గవర్నర్ కి విన్నవించారు.
గురువారం (డిసెంబర్ 5) సాయంకాలం ఐదు గంటల నుంచి ఏడు గంటలవరకు తెలుగు పరిశ్రమలోని అన్ని విభాగాలవారు డా. జస్టిస్ ఫర్ దిశా ఆత్మశాంతి కొరకు సంతాప సభను ఏర్పాటు చేస్తున్నట్లు మా కార్యవర్గం ప్రకటించింది. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లోని కన్వెన్షన్ హాలులో ఈ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. సభ్యులందరు ఐదు గంటలకు రామానాయుడు కళామండపం దగ్గర సమావేశం కావాలని 'మా'కార్యవర్గం కోరింది.