Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హృదయం ముక్కలైంది.. దర్శకుడి మృతిపై మాధవన్ ఎమోషనల్
2020లో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో. సినీ ప్రముఖులు వెంట వెంనటే నేల రాలుతున్నారు. ఈ ఏడాది రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్ వంటి దిగ్గజాల మరణంతో మొదలై.. నేటికీ ఎవరినో ఒకరిని బలి తీసుకుంటూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ దర్శకడు నిషికాంత్ కామత్ మరణించారు. అయితే ఈయన మరణ వార్తలపై నిన్న జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఉండగానే చనిపోయారనే వార్తలు దావానంలా వ్యాపించాయి.
దీంతో కొందరు సెలెబ్రిటీలు మీడియాపై ఫైర్ అయ్యారు. నిషికాంత్ బతికే ఉన్నారనే విషయాన్ని తెలుసుకోలేక తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నాయని రితేష్ దేశ్ ముఖ్ వంటి హీరోలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేయ సంబంధింత క్యాన్సర్తో బాధపడుతున్న నిషికాంత్ నిన్న రాత్రి ప్రాణాలు విడిచారు. ఈ మేరకు తన దర్శకుడి మృతిపై మాధవన్ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని ప్రకటించాడు.
మలయాళీ దృశ్యం సినిమాను హిందీలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నిషికాంత్ మొదటగా మరాఠీలోఓ చిత్రాన్ని చేశారు. నిషికాంత్ మరాఠీలో చేసిన మొదటి చిత్రం డాంబివాలి ఫాస్ట్ను తమిళంలో మాధవన్తో రీమేక్ చేశారు. మాధవన్ హీరోగా ఎవనో ఒరువాన్ అంటూ తెరకెక్కించగా అది సూపర్ హిట్ అయింది. ఇలా తన దర్శకుడి అకాల మరణంతో మాధవన్ ఎమోషనల్ అయ్యాడు. హృదయం బద్దలైంది.. స్వర్గం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది.. మిమ్మల్ని, మీ పాజిటివ్ నేచర్ను ఎప్పుడూ మిస్ అవుతాం మై డియర్ బ్రో. నా కెప్టెన్కు ఇదే వీడ్కోలు, ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ పోస్ట్ చేశాడు.