జబర్దస్త్లో చేయొద్దని కామెంట్స్.. అందుకే చేశా.. క్లారిటీ ఇచ్చిన మాధవీలత
తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్ షో ఎంత ఎంత ఫేమస్సో.. హైపర్ ఆది స్కిట్స్ కూడా అంతే ఫేమస్. హైపర్ ఆది లేని జబర్దస్త్ను ఊహించలేమని కూడా కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఆ మధ్య సినిమాల్లో బిజీ కావడంతో కొన్ని ఎపిసోడ్స్లో ఆది కనిపించకపోయేసరికి టీఆర్పీ రేటింగ్స్ కూడా తగ్గాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతటి పాపులార్టీ సంపాదించున్న హైపర్ ఆది స్కిట్స్ ఈ మధ్య కలర్ఫుల్గా కనిపిస్తోంది.

ప్రతీవారం ఓ గెస్ట్..
హైపర్ ఆది ఇంత వరకు తన టీమ్ మేట్స్తోనే లాగిస్తు వచ్చాడు. మధ్య మధ్యలో అనసూయ ఎంట్రీ ఇచ్చినా అది స్పెషల్ అప్పీయరెన్స్గానే ఉండేది. అయితే ఈ మధ్య మాత్రం వారానికో గెస్ట్ను తీసుకొచ్చి తన స్కిట్స్కు రంగులను అద్దుతున్నాడు. ఈ క్రమంలో బుల్లితెర హీరోయిన్స్ను, యాంకర్స్ను, ఒకప్పటి హీరోయిన్స్ను రంగంలోకి దించుతున్నాడు.

సందడి చేసిన రోహిణి, మంజూష..
హైపర్ ఆది స్కిట్స్లో చేస్తే ఇట్టే పాపులారిటీ వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకు ఆది అడగడంతో బిగ్ బాస్ ఫేమ్ రోహిణి, యాంకర్ మంజూషలు గెస్ట్లుగా వచ్చి సందడి చేశారు. వారితో చేసిన ఆ స్కిట్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఈ క్రమంలోనే మాధవీలతను పట్టుకొచ్చాడు.

మెరిసిన మాధవీలతా..
ఈ వారం ప్రసారం అయిన జబర్దస్త్లో ఆది పక్కన మాధవీలతా మెరిసింది. అయితే గతవారం విడుదలైన ప్రోమో ఏ రేంజ్లో వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఎంతో రొమాంటిక్గా కట్ చేసిన ఆ ప్రోమో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.
Recommended Video


అందుకే చేశా..
అయితే జబర్దస్త్ షోలో చేయకండని తనకు మెసెజ్లు వస్తున్నాయని, ఒక్క ఎపిసోడ్ కోసమే వెళ్లానని, అది కూడా గెస్ట్గా రమ్మని హైపర్ ఆది పిలిచాడని అందుకే వెళ్లినట్టు చెప్పుకొచ్చింది. అందర్నీ నవ్వించే షో కావడం, పైగా హైపర్ ఆది స్కిట్ కావడంతోనే గెస్ట్గా వెళ్లానని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











