Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహర్షి విడుదలపై మళ్ళీ అనుమానాలు!
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. రైతు సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్నాడు. మహర్షి చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్ర విడుదల ఇప్పటికే ఓ సారి వాయిదా పడింది. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని 25కు మార్చారు. ఈ తేదీ కూడా వాయిదా పడిందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఏప్రిల్ 25నే ఖాయం చేస్తూ చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసింది. అయినా కూడా మహర్షి విడుదలకు సంబంధించి అనుమానాలు ఆగడం లేదు.
మహర్షి చిత్ర విడుదల మే నెలకు వాయిదా పడబోతున్నట్లు సమాచారం. దీనిపై చిత్ర యూనిట్ ఇంకా స్పందించలేదు. విడుదల తేదికి సంబంధించి దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మీడియా సమావేశంలో మహర్షి చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తారట. మహర్షి చిత్రంలో అల్లరి నరేశ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.