Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహర్షి మెమొరబుల్ మూవీ.. ట్రైలర్ అదిరింది.. కొరటాల శివ
సూపర్స్టార్ మహేష్ హీరోగా సూపర్హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా బ్యానర్లపై అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'మహర్షి'. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. కమెడియన్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఆటపాటలతో వేదిక హోరెత్తింది. సూపర్స్టార్ మహేష్కు ఇది 25వ చిత్రం కావడం విశేషంగా మారింది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ...
సూపర్స్టార్ మహేష్ ఫ్యాన్స్కు అభినందనలు. 25వ సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు, పీవీపీకి మెమోరబుల్గా మారాలని కోరుకొంటున్నాను. మహేష్ జీవితంలో గొప్ప సినిమాగా రూపొందించడం గొప్ప బాధ్యత. ట్రైలర్లో ఎమోషన్స్ చూపించడం ఎంత కష్టమో నాకు తెలుసు. మహేష్ కెరీర్లో బెస్ట్ సినిమాగా మారాలని కోరుకొంటున్నాను. పూజా, అల్లరి నరేష్, పోసానికి గొప్ప చిత్రంగా మారాలి. దేవీ శ్రీ ప్రసాద్ గురించి నేను ఎక్కువగా చెప్పలేను. చిత్ర యూనిట్కు బెస్ట్ ఆఫ్ లక్ అని కొరటాల శివ అన్నారు.
మే 9వ తేదీన రిలీజ్ కానున్న మహర్షి సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియోలకు అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఈ సూపర్ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్, సునీల్బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.