twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    21 రోజుల లాక్ డౌన్.. సితార ఫీలింగ్ ఎలా ఉందంటే..?

    |

    కరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా గజగజవణుకుతోంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందికి కరోనా సోకగా.. వేలమంది ప్రాణాలను కోల్పోయారు. మన దేశంలోనూ ఇప్పటికే దాదాపు 600 మంది కరోనా బారినపడ్డట్టు తెలుస్తోంది. ఈ వైరస్‌కు విరుగుడును ఇంకా కనిపెట్టలేకపోవడంతో మానవాళి భయంతో వణికిపోతోంది. ఈ వైరస్ ధాటికి బెదిరిపోతోన్న చాలా దేశాలు ఇప్పటికే లాక్ డౌన్‌ను ప్రకటించాయి.

    భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం దేశం మొత్తం లాక్ డౌన్‌ను ప్రకటించాడు. రానున్న 21 రోజులు దేశం మొత్తం మూత పడిపోతుందని పేర్కొన్నాడు. అయితే ఈ నిర్ణయాన్ని సెలెబ్రిటీలు, సామాన్య జనం అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ సమర్థించారు. 21 రోజుల పాటు ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండని సూచిస్తున్నారు. ఈ క్రమంలో నమ్రతా శిరోద్కర్ ఓ పోస్ట్ చేసింది.

    Mahesh Babu And Sitara Enjoying Lockdown In Quarantine Time

    మహేష్ బాబు తన ఫ్యామిలీకి ఎంత సమయాన్ని కేటాయిస్తాడో అందరికీ తెలిసిందే. సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా మధ్యలో టైమ్ వెచ్చించి మరీ కుటుంబాన్ని విదేశాలకు తీసుకెళ్తుంటాడు. అక్కడ సితార, గౌతమ్ చేసే అల్లరి గురించి నమ్రత నిత్యం సోషల్ మీడియాలో చెబుతూనే ఉంటుంది. ముఖ్యంగా సితార నాన్న కూచి అన్న సంగతి తెలిసిందే. ఇక 21 రోజులు లాక్ డౌన్ తెలియడంతోనే సితార చాలా హ్యాపీగా ఫీలైనట్టు నమ్రత పేర్కొంది. ఈ మేరకు పోస్ట్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇది కేవలం ప్రారంభమే..ఆమె నాన్న చేతుల నుంచి ఇక రాదు.. కరోనా సమయంలో జీవితం ఇలా గడిచిపోతుంది.. ఇంట్లోనే ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి అని పోస్ట్ చేసింది.

    English summary
    Mahesh Babu And Sitara Enjoying Lockdown In Quarantine Time. It’s the initial ‘go crazy ‘with happiness when they hear it’s 21 day lockdown and all she’s going to see is so much more of her favourite.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X