twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SSMB28: మహేశ్ ఫ్యాన్స్‌కు అప్పటి వరకూ నో ట్రీట్.. త్రివిక్రమ్ మూవీ పోస్టర్ ఎప్పుడంటే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. చిన్న వయసులోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న అతడు.. ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. తద్వారా హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇక, ఇటీవలి కాలంలో మహేశ్ వరుసగా 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకుని గతంలో ఎన్నడూ లేనంత ఫామ్‌తో హవా చూపిస్తున్నాడు. దీంతో మరింత ఉత్సాహంగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు.

    యాంకర్ మంజూష అందాల విందు: ఘాటు ఫోజులతో ఓ రేంజ్ ట్రీట్యాంకర్ మంజూష అందాల విందు: ఘాటు ఫోజులతో ఓ రేంజ్ ట్రీట్

    సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలే 'సర్కారు వారి పాట' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు సూపర్ స్టార్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా ఈ సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ దక్కాయి. కానీ, ఫుల్ రన్‌లో మాత్రం ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను అందుకోలేకపోయింది. అయినప్పటికీ 90 శాతం కంటే ఎక్కువ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక, ఈ సినిమా విడుదలైన తర్వాత హాలీడే ట్రిప్‌కు వెళ్లిన మహేశ్.. వచ్చిన వెంటనే ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకోబోతున్నాడని తెలుస్తోంది.

    కొన్ని నెలల క్రితమే సూపర్ స్టార్ మహేశ్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. క్రేజీ కాంబినేషన్‌లో కావడంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వెలువడినప్పటికీ.. ఈ మూవీ పూజా కార్యక్రమాలు మాత్రం కొద్ది రోజుల క్రితమే పూర్తయ్యాయి. కానీ, ఇప్పటి వరకూ ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. ఇక, జూలై నెల నుంచి ఈ సినిమా మొదలు అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

    డెలివరీ తర్వాత ఊహించని లుక్‌లో ప్రణీత: ఆమెనిలా చూశారంటే షాకే!డెలివరీ తర్వాత ఊహించని లుక్‌లో ప్రణీత: ఆమెనిలా చూశారంటే షాకే!

    సుదీర్ఘ విరామం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించబోయే ఈ సినిమా అప్‌డేట్ కోసం సూపర్ స్టార్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మే 31వ తేదీన విడుదల చేయబోతున్నారని ఆ మధ్య ఓ న్యూస్ లీకైంది. కానీ, అలా జరగలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న విడుదల చేయబోతున్నారట. అంటే అప్పటి వరకూ దీని నుంచి ఎలాంటి అప్‌డేట్ రావడం లేదని తెలిసింది. ఇది ఒకరకంగా మహేశ్ అభిమానులకు షాకింగ్ న్యూసే అని చెప్పాలి.

    Mahesh Babu and Trivikram Movie Title Poster on August 9th

    'అతడు', 'ఖలేజా' తర్వాత త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో హీరో రా ఏజెంట్‌గా కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ మూవీకి 'పార్థు', 'అతడే పార్థు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

    English summary
    Mahesh Babu recently Startes his 28 film with Trivikram Srinivas. This Movie Title Poster will Release on August 9th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X