Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చిరంజీవిని రికార్డు బద్దలుకొట్టిన మహేష్ బాబు.. కానీ ప్రభాస్తో పెట్టుకోలేక పోయాడుగా!
సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరో 'సరిలేరు నీకెవ్వరు' అంటూ సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. ఈ మేరకు ఫ్యాన్స్కి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ ఇస్తూ జోష్ నింపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ విషయంలో చిరంజీవిని దాటేసిన మహేష్ బాబు.. ప్రభాస్ని మాత్రం ఢీ కొట్టలేకపోయాడు. ఇంతకీ ఏంటా విషయం? వివరాల్లోకి పోతే..
మహేష్ బాబు జోష్.. సరిలేరు నీకెవ్వరు
సరిలేరు నీకెవ్వరు సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు మహేష్ బాబు. ఈ మేరకు ప్రమోషన్స్ సైతం ఘనంగా చేస్తూ ప్రేక్షకుల చూపు ఏ సినిమా వైపు పడకుండా అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే టీజర్, సాంగ్స్ విడుదల చేసి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న సూపర్ స్టార్.. అదేబాటలో ట్రైలర్ కూడా విడుదల చేశారు.
చిరంజీవి రిమోట్ నొక్కడంతో..
నిన్న (ఆదివారం) జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో 'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్ చిరంజీవి చేతులమీదుగా రిలీజ్ చేశారు. ఆయన రిమోట్ నొక్కగానే అక్కడి తెరపై, సామజిక మాద్యమాలపై 'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్ సెన్సేషన్ మొదలైంది. ఈ సెన్సేషన్లో చివరకు చిరంజీవి 'సైరా' కొట్టుకుపోయింది కానీ.. ప్రభాస్ 'సాహో' మాత్రం ఏ మాత్రం బెనకలేదు.
ఇదీ పరిస్థితి.. చిరంజీవి, ప్రభాస్
విడుదలై ఫాస్టెస్ట్ 100K లైకులు సాధించిన ట్రైలర్ పరంగా చూస్తే.. 'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్ రెండో స్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే ప్రభాస్ 'సాహో' తన మొదటి స్థానాన్ని స్థిరంగా ఉంచుకుంది. చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి' ట్రైలర్ ప్రభంజనాన్ని మాత్రం అలవోకగా అధిగమించింది 'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్.
వివరంగా మీ కోసం..
ప్రభాస్ 'సాహో' ట్రైలర్ 27 నిమిషాల్లో 100K లైక్స్ సాధించి ఫస్ట్ ప్లేస్లో ఉండగా, మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్ 37 నిమిషాల్లో ఆ ఘనత సాధించి రెండో స్థానంలో ఉంది. ఆ తరువాత మూడో స్థానంలో చిరంజీవి సైరా నరసింహా రెడ్డి (40 నిమిషాలు), ఎన్టీఆర్ అరవింద సమేత (67 నిముషాలు) నాలుగో స్థానంలో ఉంది.
మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'
మహేష్ బాబు- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. విజయశాంతి ముఖ్యపాత్ర పోషించింది. ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరించారు. సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.