Don't Miss!
- News ఊపిిరి పీల్చుకున్న ఉద్యాననగరి
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
రూ. కోటి సాయం ప్రకటించిన శ్రీమంతుడు.. బాధ్యతాయుత పౌరులుగా.. మహేష్ బాబు కామెంట్స్
కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు లాక్ డౌన్ను ప్రకటించాయి. 21 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని, సురక్షితంగా ఉండాలని సూచించాయి. ప్రజలంతా పరిశుభ్రతను పాటించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.
Recommended Video
అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలకు అండగా నిలిచేందుకు సినీ హీరోలు ముందుకు వచ్చారు. టాలీవుడ్ ప్రముఖులు అంతా వరుసకట్టి విరాళాలు అందిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమవంతుగా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. హీరో నితిన్ మొదలు పెట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కొరటాల శివ, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి వంటి వారు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
రూ. కోటి ప్రకటించిన పవన్ కళ్యాణ్..
కేంద్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వాలకు యాభై లక్షల చొప్పున ప్రకటించాడు. త్రివిక్రమ్ పది లక్షల చొప్పున, అనిల్ రావిపూడి, కొరటాల శివ ఐదు లక్షల చొప్పున విరాళాలు ప్రకటించారు.
|
మహేష్ బాబు విరాళం..
ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలు చేస్తోన్న కృషి అభినందనీయం.. ఈ యుద్దంలో ప్రభుత్వానికి సాయం చేసేందుకు నా వంతుగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. కోటి రూపాయల విరాళాన్ని అందిస్తున్నాను. మీ వంతుగా సాయం చేయాలని అందర్ని కోరుతున్నాను.
బాధ్యత గల పౌరులుగా
ప్రతీ ఒక్క విరాళం ఎంతో మార్పును తీసుకురావచ్చు.. బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ను, నియమాలను అందరూ పాటించండి.. మీ అందర్నీ నేను అదే కోరుతున్నాను.. మనల్ని మనం కాపాడుకోవాలి.. మనందరం కలిసి పోరాడాలి.. విజయం సాధించాలి.. అంత వరకు ఇంట్లోనే ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి.