Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ బాబు- అనిల్ రావిపూడి మూవీ టైటిల్ రిజిస్టర్ అయింది!
'మహర్షి'తో మరో భారీ విజయం తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు తర్వరలో 'ఎఫ్ 2' ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇది మహేష్ బాబు కెరీర్లో 26వ చిత్రం కాగా... ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న తొలి చిత్రం. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
దర్శకుడు అనిల్ రావిపూడి కొన్ని నెలల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా లాంచ్ చేసి జూన్ నుంచి షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం యూరఫ్ వెకేషన్లో ఉన్న మహేష్ అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే షూటింగులో జాయిన్ కాబోతున్నాడు.
సరిలేరు నీకెవ్వరు
ఎకె ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో అనిల్ సుంకర నిర్మించబోతున్న ఈ చిత్రానికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని, మహేష్ బాబు కూడా ఈ టైటిల్ మీద సుముఖంగా ఉండటంతో రిజిస్టర్ చేసినట్లు టాక్. సమాజంలోకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ తీసుకెళ్లే కథ కాబట్టి ఈ టైటిల్ అద్భుతంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
రష్మికకు బంపర్ ఛాన్స్
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మహేష్ స్థాయి స్టార్తో ఆమెకు ఇది తొలి అవకాశం. అయితే సినిమాకు సంబంధించిన ఏ విషయం ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అన్ని విషయాలు అఫీషియల్గా ప్రకటించే అవకాశం ఉంది.
విజయశాంతి రీ ఎంట్రీ మూవీ
ప్రముఖ నటి, నిన్నటి తరం స్టార్ హీరోయిన్ విజయశాంతి ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. పాలిటిక్స్లోకి ఎంటరైన తర్వాత చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి ఇపుడు తెరంగ్రేటం చేస్తుండటం కూడా ఈ మూవీపై అంచనాలు పెంచింది.
దేవిశ్రీ ప్రసాద్ మరోసారి
ఈ సినిమాకు కూడా మరోసారి దేవిశ్రీ ప్రసాద్ ఎంపికయ్యారు. మహేష్ బాబు గత చిత్రాలైన శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలకు హిట్ మ్యూజిక్ అందించిన దేవిశ్రీ మరోసారి సూపర్ స్టార్కు సంగీతం అందించే అవకాశం దక్కించుకున్నాడు. ఇతర టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.