Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కేరళ అందాల్లో మహేష్ బాబు.. హీరోయిన్తో కలిసి! జరగబోయేది అదే..
కేరళ అందాల్లో వాలిపోయారట సూపర్ స్టార్ మహేష్ బాబు. తన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' కోసం హీరోయిన్ రష్మిక మందన్న, చిత్ర యూనిట్తో కలిసి కేరళ రాష్ట్రంలో షూటింగ్లో పాల్గొంటున్నారట ఈ అందగాడు. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ ఫినిష్ చేసిన చిత్రబృందం కేరళ అందాల్లో మహేష్, రష్మిక రొమాన్స్ని కెమెరాలో బందిస్తోందట.
ముందుగా షెడ్యూల్ ప్రకారమే 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం మేర పూర్తయిందని తెలుస్తోంది. తాజాగా కేరళ షెడ్యూల్తో దాదాపు షూటింగ్ ఫినిష్ అవుతుందని అంటున్నారు. ఇక్కడి నాచురల్ అందాల్లో మహేష్ బాబు, రష్మిక మందన్నలపై రెండు పాటలు, చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట.
ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ కూడా చేస్తోంది 'సరిలేరు నీకెవ్వరు' యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్డేట్స్ విశేష ప్రేక్షకాదరణ పొందాయి. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ రోల్ పోషిస్తుండటం విశేషం. ఇక విజయశాంతి పాత్ర సినిమాకే హైలైట్ కానుందని తెలుస్తోంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా రూపొందుతోంది 'సరిలేరు నీకెవ్వరు'. చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్, విజయశాంతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజుతో పాటు మహేష్ బాబు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగమవుతుండటం విశేషం.