Don't Miss!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- News 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి!: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చాలా రోజులు వెయిట్ చేశాం.. న్యాయం జరిగింది: మహేష్ బాబు
నిర్భయ హత్యాచారం కేసులో నిందితులైన నలుగురు దోషులకు ఉరిశిక్ష వేయడం పట్ల పలువురు సినీ తారలు స్పందిస్తున్నారు. ఈ మేరకు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నారు. చాలా రోజులు వెయిట్ చేశాం.. చివరకు న్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
''ఇలాంటి సమయం కోసం చాలాకాలం పాటు వేచి చేశాం. న్యాయం జరిగింది. ఈ చర్య న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచింది. ఇన్నాళ్లు నమ్మకంతో పోరాటం చేసిన నిర్భయ తల్లిదండ్రులకు, న్యాయవాదులకు సెల్యూట్. న్యాయవ్యవస్థపై గౌరవం పెరిగింది. ఇలాంటి దురాగతాలకు సత్వర న్యాయం దక్కాలి, బలమైన చట్టాలుండాలి'' అని మహేష్ బాబు సందేశం పోస్ట్ చేశారు.
Long awaited but Justice done!! #NirbhayaVerdict restores our faith in the judiciary. Saluting her parents and their advocates for their continuous unflinching efforts. Respect for our judicial system🙏🙏 still advocating for stricter laws and quicker verdicts in heinous crimes🙏
— Mahesh Babu (@urstrulyMahesh) March 20, 2020
2012 నిర్భయ హత్యాచారం కేసులో నిందితులైన మొత్తం నలుగురిని ఈ రోజు (మార్చి 20) ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఉరి తీశారు. దీంతో ఎట్టకేలకు నిర్భయ కేసులో నిందితులైన ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మల పాపం పండింది. ఈ ఉరితీతపై దేశవ్యాప్తంగా సంతోషాలు వెల్లువెత్తుతున్నాయి. నిర్భయ నిందితులకు ఉరిశిక్ష అమలుకావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ అంశంపై ఇప్పటికే ప్రీతి జింటా, సుస్మిత సేన్, నాగ శౌర్య, హరీష్ శంకర్ సహా పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.