Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Major Trailer: చావుకు ఎదురుగా వెళ్లిన సైనికుడు.. దేశం గర్వించేలా అడివి శేష్ మూవీ!
విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న యువ హీరో అడవి శేష్ ఈసారి దేశం గర్వించదగిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2008 ముంబై దాడులలో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న మేజర్ సినిమాలో అడవి శేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ పాత్ర కోసం అతను చాలా హార్డ్ వర్క్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా సందీప్ ఉన్నికృష్ణన్ కుటుంబ సభ్యులతో అలాగే ఎంతోమంది ఆర్మీ వాళ్లతో కలిసి అతను ట్రావెల్ అయ్యాడు. శశికిరణ్ టిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన మేజర్ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల చేశారు. మేజర్ సినిమా మహేష్ బాబు అలాగే ఏ ప్లస్ ఎస్ మూవీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తుంది. మేజర్ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. హీరో అడివి శేష్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను చాలా అద్భుతంగా ప్రజెంట్ చేసినట్లు అనిపిస్తుంది. దేశం కోసం వీరమరణం పొందిన ఉన్నికృష్ణన్ జీవితం మొదటి నుంచి ఈ సినిమాలో చూపించబోతున్న ట్లు తెలుస్తోంది.
బార్డర్ దాటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోకి వెళ్లడం ఏమిటి అని అధికారులు అడుగుతూ ఉండగా అది కూడా మనదే కదా అని హీరో చెప్పిన డైలాగ్ తోనే ఆడియన్స్ కు ఈ సినిమా ట్రైలర్ బాగా కనెక్ట్ అయిపోయింది. మదర్ అలాగే ఫాదర్ సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో చాలా బలంగా చూపించారు. తల్లిదండ్రులకు కొడుకు ఆర్మీ లోకి వెళ్లడం ఏ మాత్రం ఇష్టం ఉండదు అయితే ప్రతి తల్లి కూడా ఇలానే అనుకుంటుందా అని హీరో చెప్పిన డైలాగ్ కూడా ఎంతగానో ఆలోచింపజేస్తోంది.
NSG కమాండో సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితంలోని ప్రతి ముఖ్యమైన ఘట్టాన్ని ఈ సినిమాలో హైలెట్ చేసి చూపించినట్లుగా తెలుస్తుంది. అలాగే అతని ప్రేమ కథను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారని కొన్ని సన్నివేశాలు క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ సినిమాలో శోభితా ధూళిపాల సాయి మంజ్రేకర్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నాడు.
వాడికి ఒక మంచి కొడుకు గా ఉండడం కంటే.. ఒక మంచి భర్త గా ఉండడం కంటే.. ఒక సోల్జర్ గా ఉండడం అవసరం.. అని ప్రకాష్ చెప్పిన డైలాగ్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. టైమ్ కి మనం లేకపోయినప్పుడు ఒక ప్రాణం పోయినా కూడా నన్ను నేను నా లైఫ్ లో సోల్జర్ అని అనుకోలేను.. అని అంటూ శేష్ చెప్పిన మరొ డైలాగ్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంది.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వెనకడుగు వేసే అవకాశం ఉన్నా.. తప్పించుకునే దారి ఉన్నాకూడా దొరికితే చనిపోతాడు అని తెలుసు.. అయినా కూడా వెనుకడుగు వేయలేదు.. చావు కళ్ళల్లోకి చూసి. నువ్వు నా ప్రాణం తీసుకోవచ్చు కానీ దేశాన్ని కాదు.. అని అతను పోరాడినట్లు ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చిన డైలాగ్ కూడా చాలా బావోద్వేగంగా ఉన్నాయి. ఇక జూన్ 3న రాబోతున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అనిపిస్తోంది.