Don't Miss!
- News ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్
- Sports RCB vs KKR: చెలరేగిన కోహ్లీ, కార్తీక్.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ప్రతీ ఒక్కరూ గర్వంగా ఫీల్ అవుతారు.. అశేష అభిమాన వర్గం ఎదుట మహేష్ కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు విజయవాడలో నిన్న (అక్టోబర్ 13) చేసిన కొన్ని కామెంట్స్ ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. విజయవాడ సిటీలో ఓ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్కి వెళ్లిన మహేష్.. తన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడలో ఓ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్కి మహేష్ బాబుకు ప్రత్యేక ఆహ్వానం పంపారు. ఈ ఆహ్వానం మేరకు సదరు జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్కి మహేష్ వెళ్లారు. అయితే మహేష్ బాబు వస్తున్నాడనే విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున జనం అక్కడికి తరలి వచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు చూసేందుకు ఎగబడ్డారు. అశేష అభిమానుల నడుమ మహేష్ కాసేపు మాట్లాడటం ప్రాధానత్య సంతరించుకుంది.
తన 26వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' గురించి మాట్లాడిన మహేష్ బాబు.. ఈ సినిమా ప్రతీ ఒక్కరూ గర్వంగా ఫీల్ అయ్యేలా ఉంటుందని చెప్పారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నామని అన్నారు. దీంతో ఆయన మాటలు విన్న అభిమానులు 'సరిలేరు నీకెవ్వరు' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇక 'సరిలేరు నీకెవ్వరు' సినిమా విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతోనే వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తోంది. భారీ అంచనాల నడుమ జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.