Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రతీ ఒక్కరూ గర్వంగా ఫీల్ అవుతారు.. అశేష అభిమాన వర్గం ఎదుట మహేష్ కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు విజయవాడలో నిన్న (అక్టోబర్ 13) చేసిన కొన్ని కామెంట్స్ ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. విజయవాడ సిటీలో ఓ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్కి వెళ్లిన మహేష్.. తన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడలో ఓ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్కి మహేష్ బాబుకు ప్రత్యేక ఆహ్వానం పంపారు. ఈ ఆహ్వానం మేరకు సదరు జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్కి మహేష్ వెళ్లారు. అయితే మహేష్ బాబు వస్తున్నాడనే విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున జనం అక్కడికి తరలి వచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు చూసేందుకు ఎగబడ్డారు. అశేష అభిమానుల నడుమ మహేష్ కాసేపు మాట్లాడటం ప్రాధానత్య సంతరించుకుంది.
తన 26వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' గురించి మాట్లాడిన మహేష్ బాబు.. ఈ సినిమా ప్రతీ ఒక్కరూ గర్వంగా ఫీల్ అయ్యేలా ఉంటుందని చెప్పారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నామని అన్నారు. దీంతో ఆయన మాటలు విన్న అభిమానులు 'సరిలేరు నీకెవ్వరు' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇక 'సరిలేరు నీకెవ్వరు' సినిమా విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతోనే వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తోంది. భారీ అంచనాల నడుమ జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.