Don't Miss!
- News భారత్లో పెట్టుబడులపై ఎలాన్ మస్క్ యూటర్న్?
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
నా డ్రీమ్ ప్రాజెక్టు అదే.. ఆ డైరెక్టర్తో సినిమా చేయాలనుంది: మహేష్ బాబు
ప్రస్తుతం మాంచి ఫామ్ కొనసాగిస్తూ హాట్రిక్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. ఆయన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ విషయం తెలిపారు. తాను అనుకుంటున్న డ్రీమ్ ప్రాజెక్టుల్లో దర్శక ధీరుడు రాజమౌళితో దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు చేయడం ఒకటని చెప్పారు.
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపడం, పైగా అది డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పడం సూపర్ స్టార్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ కాంబినేషన్ కోసం తెలుగు ప్రేక్షకలోకం ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది. ఇప్పుడు మహేష్ స్వయంగా ఈ టాపిక్ తీయడంతో.. రాజమౌళి- మహేష్ కాంబీలో మూవీ వస్తే రికార్డులు బ్రేక్ కావడం ఖాయం అని చెప్పుకుంటున్నారు ప్రేక్షకులు.
మరోవైపు మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా మంచి టాక్తో దూసుకుపోతూ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక నటించింది. ఇందులో మహేష్ బాబు కామెడీ టైమింగ్, మాస్ ఎలిమెంట్స్, డ్యాన్స్ ఆకట్టుకున్నాయని అంటున్నారు జనం.
13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి నటన సినిమాకు ప్లస్ అయిందని విశ్లేషకులు చెప్పారు. చాలా రోజుల తర్వాత ప్రకాష్రాజ్ విలనిజం కలిసొచ్చిందని టాక్ నడుస్తోంది. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా చూసిన సూపర్ స్టార్ అభిమానులైతే "నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్" అంటూ ఖుషీ అవుతున్నారు.