మహర్షి ట్రైలర్కు ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ ఎదురుచూపులు!
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. మే 9న మహర్షి చిత్రం విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. మహేష్ బాబు ఈ చిత్రంలో మూడు లుక్స్ లో కనిపించబోతున్నాడు. మే 1న మహర్షి చిత్ర యూనిట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతోంది.
ఇక మహేష్ అభిమానులు మహర్షి ట్రైలర్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ విడుదలకు కూడా తాజాగా ముహూర్తం ఖరారైంది. బుధవారం జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంట్ లో 8: 10 గంటలకు మహర్షి ట్రైలర్ విడుదల చేయనున్నారు. కథకు సంబంధించిన మరింత క్లారిటీ ట్రైలర్ తో వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం రైతుల సమస్యలపై ఉండనునట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఊపిరి చిత్రం తర్వాత దర్శకుడు వంశీ పైడిపల్లి నుంచి వస్తున్న చిత్రం ఇదే. వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజా హెగ్డే తనకు ఈ చిత్రం మరింత క్రేజ్ తీసుకువస్తుందని భావిస్తోంది.


Click it and Unblock the Notifications











