Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సెల్యూట్.. మీరే రియల్ హీరోస్ అనేసిన మహేష్ బాబు.. వైరల్ అవుతున్న ట్వీట్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 ఉపగ్రహం విషయమై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. దేశ ప్రధాని మొదలుకొని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఇప్పటికే ఇస్రోకి అండగా నిలవగా.. తాజాగా మహేష్ బాబు, ఇస్రో సైంటిస్టులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
చివరి నిమిషంలో చంద్రయాన్ 2
చంద్రయాన్2 ప్రయోగానికి సంబంధించి చివరి నిమిషంలో కమ్యూనికేషన్ వ్యవస్థతో సంకేతాలు తెగిపోవడంతో ప్రయోగం విఫలమైంది. చిట్టచివరి దశలో ఇలా ప్రతిష్టాత్మక ప్రయోగం విఫలం కావడం దేశంలోని ప్రతీ ఒక్కరినీ బాధపెట్టింది. కానీ గుండె నిబ్బరం చేసుకొని అందరు కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలుస్తున్నారు.
మహేష్ బాబు ట్వీట్.. సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్
ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశిస్తూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. ‘సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్.. ఇట్స్ ఏ జర్నీ' అంటూ మహర్షి సినిమా డైలాగ్ తో ఒకే ఒక్క మాట ద్వారా ఇస్రో శాస్త్రవేత్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
|
మీరే నిజమైన హీరోలంటూ
అంతేకాదు.. చంద్రయాన్ 2తో చారిత్రాత్మక ప్రయాణం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలందరికీ నా సెల్యూట్ అని పోస్ట్ పెట్టారు మహేష్ బాబు. మీరే నిజమైన హీరోలంటూ ఈ సందర్బంగా ఇస్రో శాస్త్రవేత్తలను కొనియాడారు. మేమంతా మీతో ఉన్నాం అంటూ భరోసా ఇచ్చారు. ఇది మీ విజయానికి ఆరంభం మాత్రమే అంటూ తనదైన శైలిలో ట్వీట్ పెట్టారు మహేష్ బాబు.
మహేష్.. సరిలేరు నీకెవ్వరు
ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ 26 వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి ఈ సినిమాతోనే తిరిగి వెండితెరపై కాలుమోపుతోంది.