Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తమన్నాతో మహేష్ బాబు రొమాన్స్.. ఆతృతగా ఉందన్న మిల్క్ బ్యూటీ
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తమన్నాతో రొమాన్స్ చేస్తున్నాడట. అదికూడా ఈ రోజే (డిసెంబర్ 9). ఈ మేరకు ఇద్దరూ కలిసి తెగ హంగామా చేస్తున్నారని తెలిసింది. ఈ విషయాన్ని తెలుపుతూ స్వయంగా దేవీ శ్రీ ప్రసాద్ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఇంతకీ తమన్నా, మహేష్ ఎక్కడ కలిశారు? ఎందుకు కలిశారు? వివరాల్లోకి పోతే..
స్పెషల్ బ్యూటీస్ అవసరమే లేదు.. మిల్కీబ్యూటీ తమన్నా
ఈ రోజుల్లో హీరోయిన్లే ఐటెం భామలుగా మారుతున్నారు. ప్రేక్షకులను ఉర్రుతలూగించేందుకు స్పెషల్ బ్యూటీస్ అవసరమే లేకుండా పోతోంది. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ ఐటెం సాంగ్స్లో రెచ్చిపోయేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'లో ఆయనతో చిందులేసేందుకు ఓకే చెప్పింది మిల్కీబ్యూటీ తమన్నా.
సెట్స్పై మహేష్ బాబుతో రొమాన్స్ చేస్తూ హంగామా
ఈ మేరకు 'సరిలేరు నీకెవ్వరు' సెట్స్పై మహేష్ బాబుతో రొమాన్స్ చేస్తూ తెగ హంగామా చేస్తోందట తమన్నా. దేవిశ్రీ అందించిన బాణీలపై అందరినీ హుషారెత్తించేలా డాన్సులు చేస్తోందట. ఈ రోజు దీనికి సంబంధించిన షూట్ జరుగుతోందని దేవీ శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు.
ఆతృతగా ఉందన్న తమన్నా.. ఇప్పుడు
ఇప్పటికే ఈ సాంగ్ గురించి తనదైన స్టైల్ కామెంట్ చేసింది తమన్నా. తాను ఓ మాస్ పాటకు స్టెప్పులేసి చాలా రోజులైందని, అందుకే 'సరిలేరు నీకెవ్వరు' పాట కోసం ఎంతో ఎదురుచూస్తున్నానని తెలిపింది. పైగా ఈ పాటకు దేవి శ్రీ సంగీతం అందిస్తారు కాబట్టి మరీ ఆతృతగా ఉందని చెప్పింది. ఈ టైమ్ రావడంతో చించేస్తోంది తమన్నా.
అందాలు, అందుకు తగ్గ జోష్
సాధారణం గానే తమన్నా సూపర్ డాన్సర్. అందాలు, అందుకు తగ్గ జోష్ చూపిస్తూ చిందులేయడం ఆమె ప్రత్యేకత. అలాంటిది స్పెషల్ సాంగ్, అందునా మహేష్ బాబు పక్కన అంటే ఇంకేమన్నా ఉందా!. సరిలేరు నీకెవ్వరు థియేటర్లు హోరెత్తిపోవడం ఖాయమే మరి.
సరిలేరు నీకెవ్వరు మూవీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతోనే వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.