Don't Miss!
- News ఎంపీ ఎన్నికల బరిలో బర్రెలక్క.. ఇంపాక్ట్ ఉంటుందా?
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సరిలేరుకు టైమ్ ఫిక్స్ అయింది.. మహేష్ ఎప్పుడు వస్తున్నాడంటే..?
భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన సూపర్ స్టార్.. మరో సారి బాక్సాఫీస్ను షేక్ చేసి తనకు నిజంగానే ఎవరూ సరిలేరని నిరూపించేందుకు టైమ్ ఫిక్స్ చేసుకున్నాడు. అనిల్ రావిపూడితో చేస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదల తేదీని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఎన్నో ప్రత్యేకలతో వస్తోన్న ఈ చిత్రం సూపర్ స్టార్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని యూనిట్ చెప్పుకొస్తుంది. లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం, బండ్ల గణేష్ ఓ ముఖ్యమైన రోల్ చేయడం ఇలా ప్రతీదీ కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకున్న దర్శకుడు సూపర్ స్టార్ను ఓ రేంజ్లో చూపించాడని టాక్.
It's official... #SarileruNeekevvaru in cinemas from Jan 12th, 2020!! This Sankranti will be my biggest and most special :):)
— Mahesh Babu (@urstrulyMahesh) October 12, 2019
Thankyou @anilravipudi 🤗@vijayashanthi_m @iamRashmika @thisisDSP @RathnaveluDop @GMBents @AnilSunkara1 @AKentsOfficial @SVC_official pic.twitter.com/Q7l0BPTH74
ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్ సినిమాపై ఎన్నో అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన కర్నూలు కొండారెడ్డి బుర్జు సెట్ ప్రత్యేకంగా నిలుస్తుందని టాక్. దీని చుట్టు జరిగే సీన్స్, యాక్షన్ పార్ట్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేసేలా చేస్తాయని తెలుస్తోంది.
ఇక ఈ మూవీ అఫీషియల్ డేట్ వచ్చేసిందని మహేష్ చేసిన ట్వీట్కు దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన రిప్లై ఆకట్టుకుంటోంది. అఫీషయల్ .. మహేషియల్ అంటూ ఇక పండగ మొదలుపెడదామని అన్నాడు. జనవరి 12 న సరిలేరు నీకెవ్వరు థియేటర్లలోకి వచ్చేందుకు ఫిక్స్ అయింది. రష్మిక మందాన్న హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి రత్నవేలు కెమెరామెన్గా పని చేస్తున్నారు.