Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సూపర్ స్టార్ ఫ్యాన్స్కు ఇక పండుగే.. సరిలేరు టీజర్ ఆ రోజే.. నేటి సాయంత్రం అధికారిక ప్రకటన
పోస్టర్లతో సినిమాపై అంచనాలు పెంచేసిన మహేష్ బాబు కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరుపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ల తరువాత వచ్చే ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయి తమ హీరో హ్యాట్రీక్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇంతవరకు అపజయం ఎదురు కాని దర్శకుడు అనిల్ రావిపూడి తమ హీరోను ఎంత పవర్ఫుల్గా చూపిస్తాడని అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ పై ఫోకస్ పెంచింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా సరిలేరు నీకెవ్వరు మూవీ టీజర్ ని విడుదల చేయనున్నట్లు.. కొద్దిరోజుల క్రితం హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీజర్ లోడ్ అవుతోందంటూ దర్శకుడు ట్వీట్ చేసిన నిమిషాల్లోనే అది వైరల్ అయింది.
Here we are with a 💥 #SarileruNeekevvaru #MASSMB pre-celebrations starts with #UnlockSLNTeaserDate 🔥
— AK Entertainments (@AKentsOfficial) November 19, 2019
At 6:03 PM Today 🤘
Super Star @urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @vijayashanthi_m @iamRashmika @RathnaveluDop @ThisIsDSP #SarileruNeekevvaruTeaser pic.twitter.com/3w9bfeRnDt
అయితే నేటి సాయంత్రం 6:03నిమిషాలకు టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఈ మేరకు యూనిట్ అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేశారు. టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేష్ ఫ్యాన్స్ ఈ ప్రకటనతో పండుగ చేసుకోవడం ఖాయం. ఈనెల 23న ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి జన్మదినం నేపథ్యంలో ఆరోజు టీజర్ విడుదల చేసే అవకాశం కలదని కొందరు భావిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర మరియు మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, విజయ శాంతి ఓ కీలక రోల్ చేస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.