Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సూపర్ స్టార్ ఫ్యాన్స్కు ఇక పండుగే.. సరిలేరు టీజర్ ఆ రోజే.. నేటి సాయంత్రం అధికారిక ప్రకటన
పోస్టర్లతో సినిమాపై అంచనాలు పెంచేసిన మహేష్ బాబు కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరుపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ల తరువాత వచ్చే ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయి తమ హీరో హ్యాట్రీక్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇంతవరకు అపజయం ఎదురు కాని దర్శకుడు అనిల్ రావిపూడి తమ హీరోను ఎంత పవర్ఫుల్గా చూపిస్తాడని అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ పై ఫోకస్ పెంచింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా సరిలేరు నీకెవ్వరు మూవీ టీజర్ ని విడుదల చేయనున్నట్లు.. కొద్దిరోజుల క్రితం హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీజర్ లోడ్ అవుతోందంటూ దర్శకుడు ట్వీట్ చేసిన నిమిషాల్లోనే అది వైరల్ అయింది.
Here we are with a 💥 #SarileruNeekevvaru #MASSMB pre-celebrations starts with #UnlockSLNTeaserDate 🔥
— AK Entertainments (@AKentsOfficial) November 19, 2019
At 6:03 PM Today 🤘
Super Star @urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @vijayashanthi_m @iamRashmika @RathnaveluDop @ThisIsDSP #SarileruNeekevvaruTeaser pic.twitter.com/3w9bfeRnDt
అయితే నేటి సాయంత్రం 6:03నిమిషాలకు టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఈ మేరకు యూనిట్ అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేశారు. టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేష్ ఫ్యాన్స్ ఈ ప్రకటనతో పండుగ చేసుకోవడం ఖాయం. ఈనెల 23న ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి జన్మదినం నేపథ్యంలో ఆరోజు టీజర్ విడుదల చేసే అవకాశం కలదని కొందరు భావిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర మరియు మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, విజయ శాంతి ఓ కీలక రోల్ చేస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.