Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
SSMB 28: మహేష్ స్పీడ్ మామూలుగా లేదు.. KGF మాస్టర్స్ తో జెట్ స్పీడ్ లో ఫినిష్!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ SSMB 28 షూటింగ్ ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాలతో ఇదివరకే రెండుసార్లు కలిసి వర్క్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు ఇప్పుడు మూడవసారి కలిసి వర్క్ చేస్తూ ఉండడంతో ప్రేక్షకులలో అయితే అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ అయితే శరవేగంగా కొనసాగుతోంది.
మహేష్ బాబుతో ఒక యాక్షన్ సన్నివేశం తోనే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కేజీఎఫ్ సినిమాకు వర్క్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అన్బరివ్ ఈ సినిమాకు కూడా యాక్షన్ డైరెక్టర్స్ గా వర్క్ చేస్తున్నారు. ఇక ముందస్తుగానే ప్లాన్ చేసుకొని సినిమాలో హైలెట్ గా ఉండే విధంగా ఒక యాక్షన్స్ సన్నీవేశాలను పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా చిత్ర నిర్మాణ సంస్థ ఇచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మొత్తానికి అనుకున్నట్లుగానే ఫస్ట్ షెడ్యూల్లో ఒక యాక్షన్ సన్నివేశాన్ని పూర్తి చేసినట్లుగా తెలిపారు.
ఇక ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నట్లు కూడా వివరణ ఇచ్చారు. మహేష్ ప్లాన్ ప్రకారం అయితే ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్స్ సన్నీవేషాలు అలాగే ఎక్కువ టైమ్ కోసమే తీసుకునే సన్నివేశాలను ముందుగానే ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరిలోపు ఫినిష్ చేయాలని కూడా ఆలోచిస్తున్నాడు.
ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో కొత్త సినిమా కోసం ముందుగానే సిద్ధం కావాల్సింది ఉంటుంది కాబట్టి త్రివిక్రమ్ ప్రాజెక్టును వీలైనంత తొందరగా పూర్తి చేస్తేనే బెటర్ అని ఫిక్స్ అయ్యారట. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో కూడా త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫైనల్ గా సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. హారిక హాసిని ప్రొడక్షన్లో చినబాబు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.