Don't Miss!
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్గా పరుగుల చిరుత.!
- News కూతురు ఎవరికైనా కూతురే, ఎన్నికల సమయంలో రాజకీయాలా, నీతులు చెబుతున్న లీడర్!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కరోనా సంక్షోభానికి చెక్ పెట్టాలంటే.. అలా చేయాల్సిందే.. సర్కార్కు మహేష్బాబు సతీమణి సూచన
దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న సమయంలో పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ఊపందుకొన్నది. ఒక్కొరాష్ట్రం ఒక్కో విధంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను చేపట్టాయి. తాజాగా మధ్య ప్రదేశ్, మహరాష్ట్రలోని కీలక పట్టణాలు భోపాల్, ముంబైలో వాక్సినేషన్ ప్రక్రియ జోరందుకొన్నది. భోపాల్, ముంబైలో జరుగుతున్న వాక్సినేషన్ ప్రక్రియపై సూపర్స్టార్ మహేష్ బాబు సతీమణి, మాజీ మిస్ ఇండియా నమత్ర శిరోద్కర్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ రెండు పట్టణాల్లో జరుగుతున్న వాక్సినేషన్ ప్రక్రియపై ప్రశంసల జల్లు కురిపించారు.
అందానికి మరో అర్దాన్ని చెబుతున్న హీనా పంచల్
ముంబై, భోపాల్ నగరాల్లో వయోవృద్ధులకు, సీనియర్ సిటిజన్లకు కారులోనే వాక్సినేషన్ ఇస్తున్న తీరు అందర్నీ ఆకట్టుకొంటున్నది. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ అధికారుల చర్యలను అభినందిస్తున్నారు.
ఈ సందర్భంగా నమ్రత శిరోద్కర్ తన ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ... కరోనా సంక్షోభం నుంచి బయటపడాలంటే.. తప్పనిసరిగా వాక్సినేషన్ తీసుకోవాల్సిందే. అంటూ కామెంట్ చేశారు. భోపాల్; ముంబై నగరాల్లో డ్రైవ్ ఇన్ వాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది. సీనియర్ సిటిజన్లకు వారి కారులోనే వాక్సిన్ షాట్స్ ఇవ్వడం సూపర్ కూల్ కదా.. ఇలాంటి కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చేపట్టాలి అని నమ్రత శిరోద్కర్ సూచించారు.