Don't Miss!
- News కొడాలి నాని సంచలన కామెంట్స్..ఎన్నికల్లో పోటీ చేయనంటూ
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కరోనా సంక్షోభానికి చెక్ పెట్టాలంటే.. అలా చేయాల్సిందే.. సర్కార్కు మహేష్బాబు సతీమణి సూచన
దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న సమయంలో పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ఊపందుకొన్నది. ఒక్కొరాష్ట్రం ఒక్కో విధంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను చేపట్టాయి. తాజాగా మధ్య ప్రదేశ్, మహరాష్ట్రలోని కీలక పట్టణాలు భోపాల్, ముంబైలో వాక్సినేషన్ ప్రక్రియ జోరందుకొన్నది. భోపాల్, ముంబైలో జరుగుతున్న వాక్సినేషన్ ప్రక్రియపై సూపర్స్టార్ మహేష్ బాబు సతీమణి, మాజీ మిస్ ఇండియా నమత్ర శిరోద్కర్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ రెండు పట్టణాల్లో జరుగుతున్న వాక్సినేషన్ ప్రక్రియపై ప్రశంసల జల్లు కురిపించారు.
అందానికి మరో అర్దాన్ని చెబుతున్న హీనా పంచల్
ముంబై, భోపాల్ నగరాల్లో వయోవృద్ధులకు, సీనియర్ సిటిజన్లకు కారులోనే వాక్సినేషన్ ఇస్తున్న తీరు అందర్నీ ఆకట్టుకొంటున్నది. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ అధికారుల చర్యలను అభినందిస్తున్నారు.
ఈ సందర్భంగా నమ్రత శిరోద్కర్ తన ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ... కరోనా సంక్షోభం నుంచి బయటపడాలంటే.. తప్పనిసరిగా వాక్సినేషన్ తీసుకోవాల్సిందే. అంటూ కామెంట్ చేశారు. భోపాల్; ముంబై నగరాల్లో డ్రైవ్ ఇన్ వాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది. సీనియర్ సిటిజన్లకు వారి కారులోనే వాక్సిన్ షాట్స్ ఇవ్వడం సూపర్ కూల్ కదా.. ఇలాంటి కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చేపట్టాలి అని నమ్రత శిరోద్కర్ సూచించారు.