Don't Miss!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
మహేశ్ బాబు గోవా ‘స్పెషల్’ టూర్: సర్కారు వారి కోసం అలా ప్లాన్ చేస్తున్నారు
కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం దుబాయ్లో జరుగుతోంది. ఇప్పటికే అక్కడ ఓ షెడ్యూల్ను పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్.. ఆ వెంటనే మరో దానిని కూడా ప్రారంభించేసింది. ఈ రెండింటిలోనూ హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలతో పాటు మహేశ్ బాబు ఇంట్రడక్షన్ ఫైట్ సహా కొన్ని ముఖ్యమైన సీన్స్ చిత్రీకరించారని తెలుస్తోంది.
'సర్కారు వారి పాట'ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తోన్న మహేశ్ బాబు.. నిరాంతరాయంగా జరగనున్న షూట్లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే దాదాపు నెల రోజులకు పైగానే దుబాయ్లో ఉంటోన్న అతడు.. అక్కడి నుంచి నేరుగా గోవా రాబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అక్కడ జరగనున్న పాట చిత్రీకరణ కోసం హీరోయిన్ కీర్తి సురేష్తో కలిసి అక్కడ వాలిపోనున్నాడని తెలుస్తోంది. వీళ్లిద్దరిపై గోవా బీచ్లో ఓ స్పెషల్ డ్యూయెట్ను చిత్రీకరించేందుకు ఇప్పటికే దర్శకుడు పరశురాం ప్లాన్ ప్రకారం ఏర్పాట్లను కూడా చేయిస్తున్నాడని టాక్.
'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత మహేశ్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట'ను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, జీ మహేశ్ బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యాంకులను మోసం చేసి పరారవుతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. 2022 సంక్రాంతి కానుకగా ఇది విడుదల కానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.