Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘మోసగాళ్లు’పై మహేశ్ బాబు ట్వీట్: అను అండ్ అర్జున్కు విషెస్ చెప్పిన సూపర్ స్టార్
చాలా కాలంగా సరైన హిట్ పడక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు మంచు వారి అబ్బాయి విష్ణు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం సైబర్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని ఎంచుకుని 'మోసగాళ్లు' అనే సినిమా చేశాడు. జెఫ్రీ గీచిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచారాన్ని ముమ్మరం చేసేసింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్తో పాటు వరుస ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు వీళ్లకు మరింత బూస్టును ఇచ్చాడు.
మంచు విష్ణు నటించిన 'మోసగాళ్లు' మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో ఈ మూవీ ట్రైలర్ను షేర్ చేశాడు. అంతేకాదు, 'అను అండ్ అర్జున్ల మోసగాళ్లు ఆసక్తికరంగా ఉంది. ఇందులో నటించిన మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టిలతో పాటు ఈ టీమ్ మొత్తానికి నా బెస్ట్ విషెస్' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిన విషయం తెలిసిందే.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'మోసగాళ్లు' చిత్రాన్ని ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు విష్ణు స్వయంగా నిర్మించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ - మంచు విష్ణు అక్కా తమ్ముడిగా నటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలో పెద్దదైన ఐటీ స్కాం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఇక, ఈ సినిమాలో నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, నవదీప్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా మార్చి19న ప్రేక్షకుల ముందుకు రానుంది.