Don't Miss!
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘మాస్టర్’ డైరెక్టర్తో జూనియర్ ఎన్టీఆర్: కాంబినేషన్ సెట్ చేసిన ప్రముఖ నిర్మాత
కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRRలో మెగా హీరో రామ్ చరణ్తో కలిసి నటిస్తున్నాడు. ఇందులో అతడు రియల్ హీరో కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మూవీ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తారక్ తర్వాతి సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఇళయదళపతి విజయ్తో 'మాస్టర్' అనే సినిమాను రూపొందించిన లోకేష్ కనగరాజ్తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడట. వీళ్లిద్దరి కాంబినేషన్ను ప్రముఖ నిర్మాత మహేశ్ కోనేరు సెట్ చేసినట్లు తెలుస్తోంది. 'మాస్టర్' తెలుగు హక్కులను కొనుగోలు చేసిన ఆయన.. ఈ సినిమాతో లాభాలను అందుకున్నారు. అదే సమయంలో దర్శకుడు లోకేష్తోనూ దగ్గరయ్యాడు. ఈ చనువుతోనే తన క్లోజ్ ఫ్రెండ్ జూనియర్ ఎన్టీఆర్తో ప్రాజెక్టును సెట్ చేశాడని తెలిసింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ సినిమాలో నటించిన తర్వాత ఇది పట్టాలెక్కనుందని తెలుస్తోంది. దీనిని మహేశ్ సొంత బ్యానర్ ఈస్ట్ కోస్ట్ ఎంటర్టైన్మెంట్తో పాటు కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మించనున్నాయని సమాచారం. ఇంతలో లోకేష్.. కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ హీరోగా 'విక్రమ్' అనే సినిమాను రూపొందించనున్నాడు. గతంలో ఈ దర్శకుడు కార్తీ హీరోగా 'ఖైదీ' అనే సినిమాను రూపొందించాడు. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీతో లోకేష్ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది.