Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేశ్ బాబు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్: రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది.!
సూపర్ స్టార్ మహేశ్ బాబు - సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. గత సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సమయంలో కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాదు, విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ మూవీ విజయంతో మహేశ్ బాబు ఖాతాలో హ్యాట్రిక్ నమోదైంది. దీంతో ఈ సినిమా డబ్బింగ్ రైట్స్తో పాటు రీమేక్ హక్కుల కోసం చాలా ఇండస్ట్రీల నుంచి క్యూ కట్టారు దర్శక నిర్మాతలు.
ఈ నేపథ్యంలో తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ డిస్టిబ్యూటర్ 'సరిలేరు నీకెవ్వరు' డబ్బింగ్ హక్కులు తీసుకున్నారు. వాస్తవానికి ఎప్పుడో ఆ పనులన్నీ పూర్తి చేసి 'ఇవనుక్కు సరియాన అల్లాలై' అనే టైటిల్తో దీన్ని విడుదల చేయాలని భావించారు. అయితే, కరోనా ప్రభావంతో ఈ మూవీ విడుదల వాయిదా పడింది. ఇటీవల తమిళనాడులో థియేటర్లను పున: ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ఈ సినిమాను విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు. తాజా సమాచారం ప్రకారం.. 'ఇవనుక్కు సరియాన అల్లాలై' నవంబర్ 20 రిలీజ్ కాబోతుంది.
దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేశ్ బాబు స్వయంగా నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. అలాగే, ఇందులో విజయశాంతి, ప్రకాశ్ రాజ్, సంగీత, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, కౌముది, ఆద్య తదితరులు కీలక పాత్రలు చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇదిలా ఉండగా, ప్రముఖ డిజిటల్ మీడియా దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో సైతం ఈ మూవీకి భారీ స్థాయిలో వ్యూస్ వచ్చిన విషయం తెలిసిందే.