Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నిర్మాతగా మారిన ‘యాత్ర’ దర్శకుడు మహి వి రాఘవ్
'యాత్ర' మూవీ తర్వాత దర్శకుడు మహి వి రాఘవ్ నిర్మాతగా మారారు. తన స్నేహితులైన శివమేక, రాకేష్ మంహకాళితో కలిసి 'త్రీ ఆటమన్ లీవ్స్' పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. సంప్రదాయ తెలుగు సినిమా ప్రొడక్షన్ సంస్థల మాదిరిగా సినిమాల్ని నిర్మించి, విడుదల చేసే పద్ధతికి పూర్తి భిన్నంగా త్రీ ఆటమన్ లీవ్స్ సంస్థ పని చేస్తుందట.
ఔత్సాహికులైన రచయితల్ని, సినిమా కథలు రాయగలిగే సత్తా ఉన్న యువ ఫిల్మ్ రైటర్స్ను ప్రొత్సహిస్తూ వారి చేత కొత్త కొత్త కథల్ని తయారుచేయించడమే లక్ష్యంగా త్రీ ఆటమన్ లీవ్స్ సంస్థ ముందుకు సాగుతుందట.
కథకులకి ఆర్థికంగా సపోర్టుగా నిలుస్తూ... వారి ద్వారా తయారైన కథలను ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి నిర్మిస్తూ 'త్రీ ఆటమన్ లీవ్స్' సంస్థ ముందుకు సాగుతుందని మహి వి రాఘవ తెలిపారు. 'యాత్ర' సినిమాకి jకో ప్రొడ్యూసర్గా ఈ సంస్థ పని చేసినట్లు తెలిపారు.
త్రీ ఆటమన్ లీవ్స్ సంస్థ ప్రస్తుతం ఔత్సాహికులైన రచయితల్ని, కొత్త కథల్ని ప్రొత్సహించే నిర్మాణ సంస్థలతో భాగస్వాములు అయ్యేందుకు ముందుంటుందని, అలానే కేవలం సినిమాలనే కాకుండా వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలకి సంబంధించిన రచయితలు, ఫిల్మ్ మేకర్స్, నిర్మాణ సంస్థలు, ఛానల్ పార్టనర్స్తో జతకలిసేందుకు త్రీ ఆటమన్ లీవ్స్ సంస్థ సముఖంగా ఉందని తెలిపారు.