Don't Miss!
- News ఎన్నికల వేళ ఆలీ కీలక నిర్ణయం..!!
- Finance DA Hike: కోటి మంది ఉద్యోగులకు శుభవార్త.. మార్చి 30 నుంచి పెరిగిన జీతాలు..!!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Sports కొట్టింది SRH..కొట్టించుకుంది MI..నొప్పి మాత్రం RCBకి!
- Automobiles జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
- Technology వన్ప్లస్ నార్డ్ CE 4 ధరల వివరాలు లీక్.. గత మోడల్ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి..!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
నిర్మాతగా మారిన ‘యాత్ర’ దర్శకుడు మహి వి రాఘవ్
'యాత్ర' మూవీ తర్వాత దర్శకుడు మహి వి రాఘవ్ నిర్మాతగా మారారు. తన స్నేహితులైన శివమేక, రాకేష్ మంహకాళితో కలిసి 'త్రీ ఆటమన్ లీవ్స్' పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. సంప్రదాయ తెలుగు సినిమా ప్రొడక్షన్ సంస్థల మాదిరిగా సినిమాల్ని నిర్మించి, విడుదల చేసే పద్ధతికి పూర్తి భిన్నంగా త్రీ ఆటమన్ లీవ్స్ సంస్థ పని చేస్తుందట.
ఔత్సాహికులైన రచయితల్ని, సినిమా కథలు రాయగలిగే సత్తా ఉన్న యువ ఫిల్మ్ రైటర్స్ను ప్రొత్సహిస్తూ వారి చేత కొత్త కొత్త కథల్ని తయారుచేయించడమే లక్ష్యంగా త్రీ ఆటమన్ లీవ్స్ సంస్థ ముందుకు సాగుతుందట.
కథకులకి ఆర్థికంగా సపోర్టుగా నిలుస్తూ... వారి ద్వారా తయారైన కథలను ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి నిర్మిస్తూ 'త్రీ ఆటమన్ లీవ్స్' సంస్థ ముందుకు సాగుతుందని మహి వి రాఘవ తెలిపారు. 'యాత్ర' సినిమాకి jకో ప్రొడ్యూసర్గా ఈ సంస్థ పని చేసినట్లు తెలిపారు.
త్రీ ఆటమన్ లీవ్స్ సంస్థ ప్రస్తుతం ఔత్సాహికులైన రచయితల్ని, కొత్త కథల్ని ప్రొత్సహించే నిర్మాణ సంస్థలతో భాగస్వాములు అయ్యేందుకు ముందుంటుందని, అలానే కేవలం సినిమాలనే కాకుండా వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలకి సంబంధించిన రచయితలు, ఫిల్మ్ మేకర్స్, నిర్మాణ సంస్థలు, ఛానల్ పార్టనర్స్తో జతకలిసేందుకు త్రీ ఆటమన్ లీవ్స్ సంస్థ సముఖంగా ఉందని తెలిపారు.