Don't Miss!
- News KTR: రాముడిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వేధిస్తున్నారంటూ అమ్మాయి ఆవేదన.. అండగా నిలబడిన మంచు మనోజ్
సాధారణంగా సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తుంటాయి. కొందరు వీటిని పట్టించుకోరు. ఇంకొందరు సీరియస్గా తీసుకుంటారు. ఆ బెదిరింపులు, వేధింపులు మితిమీరితే అందరూ తిరగబడతారు. తాజాగా ఓ అమ్మాయి తనను వేధిస్తున్నారని ట్విట్టర్లో మొర పెట్టుకుంది. రాష్ట్ర డీజీపీని ట్యాగ్ చేస్తూ తన బాధనంతా వివరించింది. అయితే ఆ ట్వీట్ను చూసిన మంచు మనోజ్ అమ్మాయికి అండగా నిలబడ్డాడు.
హైద్రాబాద్లో కేపీహెచ్బీలో ఉంటున్నాను.. నాకు రోజు కొంత మంది మీడియా వాల్లే వేధిస్తున్నారు.. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు.. అసభ్యకరంగా నన్ను వేధిస్తున్నారు. మానసికంగా కృంగిపోయేలా చేస్తున్నారు. వారు జెమినీ మ్యూజిక్ చానెల్కు చెందిన వారు అంటూ తన బాధనంతా చెప్పుకొచ్చింది. అయితే ఈ ట్వీట్ను చూసిన మనోజ్ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.
హాయ్ అమ్మ.. నీకు ఇలా జరిగినందుకు క్షమంచండి.. ఆ వ్యక్తుల వివరాలు, ఫోన్ నంబర్స్ నాకు పంపించండి.. నా ఇన్ బాక్స్కు మెసెజ్ పెట్టండి అని కోరాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఈ ట్వీట్ల కింద నెటిజన్లు ఆమె భాగోతాన్ని బయట పెట్టారు.
మొన్నటి బొమ్మ అదిరింది వివాదంలో మెగా ఫ్యాన్స్, జగన్ అభిమానుల మధ్య వార్ జరిగిన సంగతి తెలిసిందే. అందులో ఈ సదరు మహిళ నాగబాబు, మెగా ఫ్యామిలీని తీవ్రంగా ధూషించింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ.. ఆ అమ్మాయికి సాయం చేయకన్నా అంటూ మనోజ్ను నెటిజన్లు కోరారు.