Don't Miss!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మంచు విష్ణు వివాదం ముగిసి.. ఓటర్కు విముక్తి..
రామా రీల్స్ బ్యానర్పై జాన్ సుధీర్ పూదోట నిర్మాతగా విష్ణు మంచు, సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వం వహించిన 'ఓటర్' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అనేక అడ్డంకులు ఎదుర్కొన్న ఈ చిత్రం మీద ఆడియన్స్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే సార్థక్ మూవీస్ సంస్థ పోటీపడి మరీ ఫ్యాన్సీ రేటుకి విడుదల హక్కులను సొంతం చేసుకుంది. ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది.
ఓటర్ రిలీజ్ను పురస్కరించుకొని నిర్మాత సుధీర్ మాట్లాడుతూ ''పదవిలో ఉన్న నాయకుడు సరిగా పనిచేయకపోతే.. అతనితో ఎలా పనులు చేయించుకోవాలో తెలిపే నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఓటు హక్కు, ఓటర్ విలువను తెలిపే ఈ చిత్రాన్ని పొలిటికల్ డ్రామాగా దర్శకుడు కార్తీక్ చక్కగా తెరకెక్కించారు. చక్కని సందేశంతోపాటు, పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన సార్థక్ మూవీస్ సంస్థ మా సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది'' అని అన్నారు.
ఇటీవల ఓటర్ చిత్రానికి కోర్టు చిక్కులు ఎదురయ్యాయి. దర్శకుడు, హీరో మంచు విష్ణుకు మధ్య తలెత్తిన గొడవలతో ఈ సినిమా కోర్టు మెట్లెక్కింది. ఓటర్ సినిమా వివాదం హీరో మంచు విష్ణు, దర్శకుడు సాయి కార్తీక్రెడ్డి మధ్య చిచ్చు రాజేసింది. పరస్పరం ఆరోపణలు చేసుకోవడం మీడియాలో ఇటీవల చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈ సినిమా నిర్మాత, దర్శకుడికి మంచు విష్ణు స్నేహితుడు లీగల్ నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో తనకు హీరో మంచు విష్ణు నుంచి బెదిరింపులు వస్తున్నాయని దర్శకుడు కార్తీక్ రెడ్డి ఆరోపించారు. ఈ వివాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వైరల్ అయ్యాయి. అయితే వారిద్దరి మధ్య సయోధ్య కుదరడంతో సినిమా రిలీజ్ లైన్ క్లియర్ అయింది.
ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: రాజేష్ యాదవ్, ఎడిటింగ్: కె.ఎల్ ప్రవీణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్ తనమాల.