Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మంచు విష్ణు 'ఢీ' స్పెషల్ ట్వీట్.. గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడా?
మంచు విష్ణు కెరీర్ లో బెస్ట్ మూవీ అంటే ఢీ అనే చెప్పాలి. ఈ హీరో అలాంటి హిట్టు ఇంతవరకు అందుకోలేదు. ఆ ఒక్క సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడనే చెప్పాలి. దర్శకుడు శ్రీను వైట్ల రేంజ్ కూడా ఆ సినిమాతోనే పెరిగింది. 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా అప్పట్లో సమ్మర్ బిగెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్ వంటి వారు అసలైన టాలెంట్ తో ఆడియెన్స్ ని ఎంతగానో అలరించారు.
ఇక మంచు విష్ణు కామెడీ టైమింగ్ ఏంటో ఆ సినిమా ద్వారా బయటపడింది. ఇక చాలా కాలంగా ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య విష్ణు సీక్వెల్ రావచ్చని హింట్ కూడా ఇచ్చాడు. ఇక ఇప్పుడు మరొక స్పెషల్ పోస్ట్ తో ఆ సినిమా గురించి స్పందించాడు. అలాగే ఒక అప్డేట్ కూడా రాబోతున్నట్లు పేర్కొన్నాడు. ఢీ 2007 ఏప్రిల్ 13న రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన అప్డేట్ నవంబర్ 23న రానున్నట్లు ఒక పోస్టర్ ను షేర్ చేశాడు మంచు విష్ణు.
వేలాదిమందికి ఇష్టమైన సినిమాల్లో డీ ఒకటి. ఆ సినిమాకు పని చేసిన వారికి గేమ్ చేంజెర్ లాంటిది. సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సినిమా అది. అలాంటిది ఢీ కంటే బెటర్ ఏమి ఉంటుందని విష్ణు ట్వీట్ చేశాడు. దీంతో త్వరలో ఈ సినిమా సీక్వెల్ పై క్లారిటీ రావచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక విష్ణు ఎన్నిసార్లు స్పందించినప్పటికి ఇంతవరకు సీక్వెల్ పై దర్శకుడు శ్రీను వైట్ల వివరణ ఇవ్వలేదు. మరి ఢీ సీక్వెల్ నిజంగా వస్తుందో లేదో తెలియాలి అంటే విష్ణు చెప్పిన డేట్ వరకు వేయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం విష్ణు మోసగాళ్ళు సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.