Don't Miss!
- News పాపం అంబాని, ఆదానిలు చాలా పేదోళ్లు, జస్ట్ రూ 16 కోట్ల రుణమాఫీ చేసిన మోదీ, టార్గెట్ చేసిన సీఎం
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
విజయ్, విక్రమ్, శింబు ప్రధాన పాత్రల్లో.. మణిరత్నం భారీ మల్టీస్టారర్!
మణిరత్నం భారత సినిమా దిగ్గజ దర్శకులలో ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మణిరత్నం ఖాతాలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. కొంత కాలంగా పరాజయాలతో నిరాశపరుస్తూ వస్తున్న మణిరత్నం.. ఇటీవల నవాబ్ చిత్రంతో సత్తా చాటారు. శింబు, విజయ్ సేతుపతి, అరవింద స్వామి ప్రధాన పాత్రలో రూపొందించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
ఈ చిత్రం అందించిన ఉత్సాహంతో మణిరత్నం మరో మల్టీస్టారర్ చిత్రానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇళయదళపతి విజయ్, చియాన్ విక్రమ్, శింబు హీరోలుగా మణిరత్నం భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్టార్ హెర్లని ఎంపిక చేసుకోవడంతో వారి వైపు నుంచి మణిరత్నంకు గ్రీన్ సిగ్నల్ రావలసి ఉంది. మణిరత్నం మాత్రం ఈ చిత్రాన్ని తెరెక్కించాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో సూపర్ స్టార్ మహేష్, మరికొంతమంది హీరోలతో ఈ కథని తెరకెక్కించడానికి మణిరత్నం ప్రయత్నించారు. కానీ అప్పట్లో ఈ ప్రాజెక్ట్ కుదరలేదు. నవాబ్ చిత్రంలో సక్సెస్ బాట పట్టడంతో పాత స్క్రిప్ట్ ని మణిరత్నం మళ్ళీ బయటకు తీశారట.