Don't Miss!
- Sports CSK vs LSG: కొంపముంచిన ముస్తాఫిజుర్.. లక్నోను గెలిపించిన స్టోయినిస్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
విజయ్, విక్రమ్, శింబు ప్రధాన పాత్రల్లో.. మణిరత్నం భారీ మల్టీస్టారర్!
మణిరత్నం భారత సినిమా దిగ్గజ దర్శకులలో ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మణిరత్నం ఖాతాలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. కొంత కాలంగా పరాజయాలతో నిరాశపరుస్తూ వస్తున్న మణిరత్నం.. ఇటీవల నవాబ్ చిత్రంతో సత్తా చాటారు. శింబు, విజయ్ సేతుపతి, అరవింద స్వామి ప్రధాన పాత్రలో రూపొందించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
ఈ చిత్రం అందించిన ఉత్సాహంతో మణిరత్నం మరో మల్టీస్టారర్ చిత్రానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇళయదళపతి విజయ్, చియాన్ విక్రమ్, శింబు హీరోలుగా మణిరత్నం భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్టార్ హెర్లని ఎంపిక చేసుకోవడంతో వారి వైపు నుంచి మణిరత్నంకు గ్రీన్ సిగ్నల్ రావలసి ఉంది. మణిరత్నం మాత్రం ఈ చిత్రాన్ని తెరెక్కించాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో సూపర్ స్టార్ మహేష్, మరికొంతమంది హీరోలతో ఈ కథని తెరకెక్కించడానికి మణిరత్నం ప్రయత్నించారు. కానీ అప్పట్లో ఈ ప్రాజెక్ట్ కుదరలేదు. నవాబ్ చిత్రంలో సక్సెస్ బాట పట్టడంతో పాత స్క్రిప్ట్ ని మణిరత్నం మళ్ళీ బయటకు తీశారట.