Don't Miss!
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Lifestyle పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హైదరాబాద్లో మణిరత్నం పాన్ ఇండియా ప్రాజెక్ట్.. సరికొత్త ప్లాన్!
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు ఏ రేంజ్ లో తెరకెక్కుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సీనియర్ డైరెక్టర్ మణిరత్నం కూడా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్టును తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పొన్నియిన్ సెల్వన్ అనే ఆ సినిమాలో కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్నారు. ఇక ఆ సినిమాకు సంబంధించిన రూమర్స్ అయితే రోజుకోటి వైరల్ అవుతోంది.
దాదాపు 500కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఆ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. అలాగే నయనతార, ఐశ్వర్యారాయ్, అదితి రావు హైదారి వంటి భామలు కూడా నటిస్తున్నారు. బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక సినిమా షూటింగ్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకుంటున్నారు.
ఇక ముఖ్యమైన ఒక షెడ్యూల్ కోసం మణిరత్నం తన యూనిట్ తో కలిసి హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్ లో జయం రవి, కార్తీలు కలిసి వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా సినిమాపై అంచనాలు భరిగానే ఉన్నాయి. కార్తీ ద్వారానే టాలీవుడ్ లో సినిమాకు హైప్ తేవాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. మరి సినిమా అభిమానుల అంచనాలను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.