Don't Miss!
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
డైరెక్టర్తో నాగార్జున వింత ప్రవర్తన.. వైరల్ అవుతున్న వీడియో
నాగార్జున తన కొత్త డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తో వింత వింతగా ప్రవర్తించాడు. డిఫరెంట్ ఆడర్స్ వేస్తూ ఆయనకు చుక్కలు చూపించారు. ఇందుకు సంబందించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ ఇండియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ నాగార్జున ఎందుకలా ప్రవర్తించాడు? ఆయన వేసిన ఆర్డర్ ఏంటి? రాహుల్ ఎలా బదులిచ్చాడు. ఆ వివరాలు చూస్తే..
ఆగస్టు 9 న మన్మథుడు 2 సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు నాగార్జున. ఈ మేరకు ఓ ఫ్రాంక్ వీడియో విడుదల చేసి ఆకట్టుకున్నారు. ఆ వీడియోలో నాగార్జున, రాహుల్ మధ్య జరిగిన సంభాషణ ఆకట్టుకుంటోంది. డైరెక్టర్ రాహుల్కు ఫోన్ చేసిన నాగార్జున, మొదట ఏం చేస్తున్నావంటూ అడుగగా ఆయన డబ్బింగ్ పనుల్లో ఉన్నానని చెప్పాడు. అయితే తనకు ఇష్టమైన ఫుడ్ తేవాలని, ఓ రెస్టారెంట్ కు రాహుల్ ను పంపించాడు నాగ్. అక్కడ మరో కస్టమర్ ఆర్డర్ చేసుకున్న జ్యూస్ తాగాలని ఆర్డర్ వేయడం, ఆ తరువాత అక్కడున్న వెయిటర్ తో వాదనకు దిగాలని సూచించడం ఇలా రకరకాలుగా రాహుల్ కి చుక్కలు చూపించారు నాగార్జున.
పరిచయం లేని ఓ యువతి ఆ రెస్టారెంట్ కు రాగా.. ఆమెతో మాటలు కలపాలని చెప్పారు నాగ్. రాహుల్ ఇబ్బంది పడుతూనే నాగ్ చెప్పినవన్నీ చేశారు. కాకపోతే ఆ అమ్మాయితో ఫ్రాంక్ చేసే సమయంలో రాహుల్ కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత ఇదంతా మూవీ ప్రమోషన్స్ కోసం చేస్తున్నానని ఆ అమ్మాయితోనే చెప్పించి రాహుల్ను టెన్షన్ నుంచి బయటపడేలా చేశారు నాగార్జున. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తద్వారా సినిమాకు బోలెడంత ప్రమోషన్ దక్కుతోంది.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మన్మథుడు 2'. గతంలో నాగార్జున కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన మన్మథడు చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆడిపాడింది. సమంత, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్ 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.