Don't Miss!
- Sports PBKS vs MI: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్లో ఓడాం: సామ్ కరణ్
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘మన్మధుడు 2’ టైటిల్ రిజిస్టర్ చేయించిన నాగార్జున?
నాగార్జున కెరీర్లో టాప్ మూవీస్ తీసుకుంటే అందులో 'మన్మధుడు' చిత్రానిది ప్రత్యేక స్థానం. కె విజయభాస్కర్ దర్శకత్వంలో 2002లో వచ్చిన ఈ చిత్రం టీవీలో వస్తే ఇప్పటికీ చూడటానికి చాలా మంది ఇస్టపడుతుంటారు. నాగార్జున, సోనాలి బింద్రే నటనతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన కథ, డైలాగులు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇలా సినిమాలో అన్నీ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి.
దాదాపు పదిహేనేళ్ల తర్వాత మళ్లీ మన్మధుడు పేరు తెరపైకి వచ్చింది. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోందనే ప్రచారం మొదలైంది. అందుకు కారణం 'మన్మధుడు 2' అనే టైటిల్ రిజిస్టర్ కావడమేనంట. ఈ టైటిల్ రిజిస్టర్ చేయించింది కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ మీద నాగార్జున అని టాక్.
ఈ వార్తలు తెరపైకి వచ్చినప్పటి నుండి రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈ వయసులో నాగార్జున మన్మధుడిగా మెప్పించగలడా? అని కొందరు... ఇది నాగార్జున కోసం కాదు ఆయన కుమారులు నాగ చతన్య లేదా అఖిల్ నటించే అవకాశం ఉందని మరికొందరు.. ఇలా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మన్మధుడు అంటే మనకు నాగార్జున తర్వాత.... కథ, డైలాగులు రాసిన త్రివిక్రమ్ ఎక్కువ గుర్తొస్తుంటాడు. మరి 'మన్మధుడు 2'లో ఈ మాటల మాంత్రికుడి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా? అనేది తెలాల్సి ఉంది.