Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రవితేజ చేతుల మీదుగా శింబు మనాడు టీజర్.. 125 కోట్ల భారీ బడ్జెట్ మూవీ కోసం మాస్ మహారాజా..
తమిళం స్టార్ హీరో శింబు మరోసారి తన స్టార్ స్టామినా చాటుకొనేందుకు ఓ భారీ చిత్రంతో ముందుకొస్తున్నారు. తన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రేంజ్లో రూపొందిన చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకులను అబ్బుర పరిచేందుకు సిద్దమయ్యారు. ఈ చిత్రానికి మాస్ మహారాజ్ తన సహకారం అందించడం ఆసక్తికరంగా మారింది.
క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'సురేష్ కామాచి" 125 కోట్ల భారీ బడ్జెట్తో హిందీ-తమిళ్-తెలుగు-కన్నడ-మలయాళ భాషల్లో నిర్మిస్తున్న బహుభాషా చిత్రం "మానాడు".ఈ చిత్రంలో దక్షిణాదిలో స్టార్ హీరో శింబు, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం. ఈ సినిమా ఫస్ట్ లుక్ రవితేజ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. ఫిబ్రవరి 3, మధ్యాహ్నం 2.34 నిమిషాలకు రవితేజ 'మానాడు' టీజర్ రిలీజ్ చేయనున్నారు.
దక్షిణాదిలో ప్రముఖ దర్శకులు భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య, కరుణాకరన్ ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. తమ చిత్రం 'మానాడు' తెలుగు టీజర్... తాజాగా 'క్రాక్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ విడుదల చేయనుండడం పట్ల దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.