Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
షాకింగ్: బోయపాటికి భారీగా కోత పడింది.. బాలయ్య కూడా చేతులెత్తేశాడట.!
ఒకప్పుడు వరుస విజయాలు.. ఒకదాని తర్వాత మరొకటి సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేవాడు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. గత సంక్రాంతి కానుకగా విడుదలైన 'వినయ విధేయ రామ' తర్వాత ఆయన పరిస్థితి దానికి భిన్నంగా తయారైంది. దీంతో ఈ స్టార్ డైరెక్టర్ చాలా రోజుల పాటు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడో ప్రకటించినప్పటికీ ఇటీవలే కన్ఫార్మ్ అయిన బాలయ్య సినిమా ప్రి ప్రొడక్షన్ పనులతో ప్రస్తుతం ఆయన తీరిక లేకుండా ఉన్నారు. ఈ సినిమా కొద్ది రోజుల్లో పట్టాలెక్కనుంది. ఈ నేపథ్యంలో బోయపాటి గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..? పూర్తి వివరాల్లోకి వెళితే...
అల్లు అరవింద్ ప్రకటన
కొద్ది రోజుల క్రితం ఓ సినిమా ఫంక్షన్లో అల్లు అరవింద్ కీలక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో ‘‘నాకు బోయపాటి గారు ‘సరైనోడు'తో సూపర్ హిట్ ఫిల్మ్ ఇచ్చారు. మా కాంబినేషన్లో మళ్లీ ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు. ఇక, దీనికి సంబంధించిన మిగిలిన విషయాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో ఈ సినిమా ఎవరితో ఉంటుందా అని అందరూ చర్చించుకున్నారు.
మెగా హీరోలు కాదని వార్తలు
అల్లు అరవింద్ ప్రకటనతో బోయపాటి మళ్లీ మెగా కాంపౌండ్లోకి అడుగు పెట్టబోతున్నాడని ప్రచారం జరిగింది. అయితే, బన్నీ వరుస సినిమాలతో బిజీగా ఉండడం, చిరు కూడా రెండు సినిమాలు కమిట్ అవడం, చరణ్ ‘RRR'తో బిజీగా ఉండడంతో వాళ్లతో సినిమా కుదరదని అనుకున్నారు. వీళ్లు తప్పితే మిగిలిన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్లు కూడా తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఆయన మెగా హీరోలతో సినిమా చేయడం లేదని అనుకున్నారు.
మాజీ సీఎం కొడుకుతో అన్నారు
కొద్ది రోజుల క్రితం బోయపాటి శ్రీను గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ‘జాగ్వార్'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కర్నాటక మాజీ సీఎం కుమారుడు నిఖిల్ గౌడతో బోయపాటి సినిమా తీయబోతున్నారనేదే దాని సారాంశం. ఈ సినిమా రెండు భాషల్లో తెరకెక్కనుందని కూడా అనుకున్నారు. కన్నడంలో మాస్ సినిమాలు బాగా చూస్తారనే ఉద్దేశ్యంతోనే బోయపాటిని ఎంచుకున్నారని టాక్ వినిపించింది.
బాలయ్యతోనే సినిమా
బాలయ్యతో బోయపాటి సినిమా ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఇంతలో ఈ నందమూరి హీరో కేఎస్ రవికుమార్తో సినిమా కమిట్ అవడం.. అది వెంటనే సెట్స్ పైకి వెళ్లిపోవడంతో ఇక వీళ్ల సినిమా ఉండదన్న కామెంట్లు వినిపించాయి. అయితే, ఇటీవల బాలయ్య - బోయపాటి కాంబినేషన్లో సినిమా ప్రారంభం అవుతుందని అధికారిక ప్రకటన వెలువడడంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. దీనికి కారణం వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘సింహా', ‘లెజెండ్' వంటి హిట్లు ఉండడమే.
బోయపాటికి భారీ కోత
వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న బోయపాటి ఒక్కో సినిమాకు రెమ్యూనరేషన్ కింద రూ. 15 కోట్లు తీసుకునే వారని టాక్ ఉంది. రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ'కు ఆయన ఇంతే మొత్తం తీసుకున్నారట. అయితే, ప్రస్తుతం బాలయ్యతో చేయబోయే సినిమాకు మాత్రం ఆయన రెమ్యూనరేషన్లో భారీ కోత పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు గానూ ఆయన రూ. 8 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.
Recommended Video
బాలయ్య కూడా చేతులెత్తేశారట
బోయపాటి రెమ్యూనరేషన్ విషయంలో బాలయ్య కూడా చేతులెత్తేశాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని బోయపాటి బాలయ్య దగ్గర ప్రస్తావించగా.. తానేమీ చేయలేనని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఈ విషయం గురించి బాలయ్యకు తెలియదని, తెలిసినా ఇది ఆయన చేతులో లేని అంశమని కొందరు అంటున్నారు. బాలయ్య డైరెక్టర్కు ఫేవర్గా ఉండే హీరో అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.