Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఫస్ట్ లుక్ పోస్టర్తో చెలరేగిన వివాదం: క్షమాపణలు కోరుతూ ‘ఆచార్య’ నిర్మాణ సంస్థ వివరణ
తక్కువ బడ్జెట్.. చిన్న చిన్న నటీనటులతో తీసినా.. ఊహించని రీతిలో విజయాన్ని అందుకున్న చిత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'. సూపర్ హిట్ టాక్తో పాటు భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా పోయిన ఏడాది ఉత్తమ చిత్రాల జాబితాలో నిలిచింది. ఈ సినిమాతో విమర్శల ప్రశంసలను అందుకున్నాడు దర్శకుడు స్వరూప్. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్న అతడు.. తాజాగా 'మిషన్ ఇంపాజిబుల్' అనే చిత్రంతో రాబోతున్నాడు. శనివారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. వెంటనే దీనిపై ఓ వివాదం చెలరేగింది.
స్వరూప్ ప్రస్తుతం 'మిషన్ ఇంపాజిబుల్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లో శ్రీకృష్ణుడు, శివుడు, హనుమంతుని గెటప్పులలో ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. వాల్లు ముగ్గురు చేతుల్లో తుపాకులు పట్టుకుని కనిపిస్తున్నారు. దీంతో తమ మతానికి చెందిన దేవుళ్లను కించపరిచేలా ఈ పోస్టర్ ఉందంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా నిర్మాణ సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు, దీన్ని తీసేయకపోతే ఫిర్యాదు చేస్తామని బెదిరించారు.
కొందరి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను గమనించిన మాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ.. ఈ పోస్టర్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ మేరకు సంస్థ తరపున ఓ నోట్ కూడా విడుదల చేసింది. తాము విడుదల చేసిన పోస్టర్ కొందరిని బాధించిందని, కానీ తాము ఎన్నడూ కూడా సమాజంలో ఎవ్వరినీ బాధపెట్టే విధంగా ఏమీ చేయాలనుకోలేదని, అనుకోకుండా ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించమని కోరుతున్నామని అన్నారు. దీనిని ఆపేందుకు పోస్టర్ను రద్దు చేస్తున్నామని సంస్థ డైరెక్టర్ అవినాష్ రెడ్డి తెలుపుతూ నోటీసు విడుదల చేశారు. కాగా, మ్యాట్నీ సంస్థ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య'కు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.