Don't Miss!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
SSMB28: మహేశ్ బాబు సినిమాలో మరో బ్యూటీ.. ఒక్క సినిమాకే భారీ ఆఫర్లు అందుకున్న భామ
టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు కొంత కాలంగా ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ మధ్య కాలంలోనే 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ స్టార్ హీరో.. హ్యాట్రిక్ను కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే చిత్రాన్ని మొదలు పెట్టిన ఈ హ్యాండ్సమ్ హీరో.. అది షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే దర్శకధీరుడు రాజమౌళితో ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టుకున్నాడు. ఇది మొదలెట్టక ముందే మరో చిత్రానికి సిగ్నల్ ఇచ్చేశాడు.
Radhe Shyam Teaser: ట్విస్ట్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్.. విక్రమాదిత్య ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీనికి ఇంకా చాలా సమయం పట్టేటట్లు ఉంది. అయినప్పటికీ కొద్ది రోజుల క్రితమే ఈ స్టార్ హీరో.. టాలీవుడ్ బడా డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమాను చేస్తున్నట్లు ప్రకటించాడు. ఊహించని విధంగా సెట్ అయిన ఈ కాంబోపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఇది ప్రకటించినప్పటి నుంచే ఎన్నో రకాల వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు అందరిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సెంటిమెంట్లను బాగా ఫాలో అవుతూ ఉంటాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ ఆరంభం నుంచీ తన చిత్రాలకు సంబంధించిన టైటిళ్లు, అందులో నటించే నటీనటులు, టెక్నీషియన్లు, షూటింగ్ స్పాట్లు ఇలా ఎన్నో విషయాల్లో ఆయన ఒక పంథాలో వెళ్తుంటాడు. ఇందులో భాగంగానే తన సినిమాల్లో ఇద్దరేసి హీరోయిన్లను కూడా పెట్టుకుంటూ ఉంటాడు. ఇక, ఇప్పుడు మహేశ్ బాబుతో చేయబోయే సినిమాలో పూజా హెగ్డేను తీసుకున్నాడు. అలాగే, ఇందులో మరో బ్యూటీని కూడా తీసుకోబోతున్నారని తెలుస్తోంది.
Bigg Boss: బిగ్ బాస్ సీక్రెట్స్ తెలుసుకున్న రవి.. టాప్ 5లో ఉండే కంటెస్టెంట్లు ఎవరో చెప్పేశాడుగా!
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించబోయే సినిమాలో సెకెండ్ హీరోయిన్గా ఎవరిని తీసుకోబోతున్నారన్న దానిపై కొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ను తీసుకున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ కోసం మాజీ మిస్ ఇండియా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. తెలుగులో 'ఇచ్చట వాహనములు నిలపరాదు' అనే సినిమా మాత్రమే చేసిన ఆమె.. ఇప్పటికే రవితేజతో 'ఖిలాడీ', ప్రభాస్తో 'సలార్'లో ఛాన్స్ పట్టేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మహేశ్ మూవీకి ఎంపికైందని టాక్.
ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కాబోతుందట. ఇందులో మహేశ్ బాబు రా ఏజెంట్గా కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు 'పార్థు', 'అతడే పార్థు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. దీనికి ఎడిటర్గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్గా ఏఎస్ ప్రకాశ్, కెమెరామెన్గా మథి, మ్యూజిక్ డైరెక్టర్గా ఎస్ థమన్ చేస్తున్నారు.