Don't Miss!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
తండ్రి కోసం రిస్క్ చేయలేనంటున్న రామ్ చరణ్.. మరింత ఆలస్యంగా ఆచార్య!
కరోనాపై ఎంత పోరాడుతున్నా కూడా ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎవరు కూడా ధైర్యంగా షూటింగ్స్ స్టార్ట్ చేయలేకపోతున్నారు. మొన్నటివరకు పర్మిషన్స్ కోసం మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ప్రముఖ దర్శకులు నిర్మాతలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
మొత్తానికి కొన్ని సడలింపులతో అనుమతులు అందుకున్నప్పటికి కొంతమంది స్టార్స్ షూటింగ్స్ స్టార్ట్ చేయడానికి ధైర్యం చేయడం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ కోసం సిద్ధమైనప్పటికి తనయుడు రామ్ చరణ్ ఆపేశాడట. దర్శకుడు కూడా కొత్త షెడ్యూల్ సెట్ చేసుకున్నప్పటికి నిర్మాతగా ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయవద్దని చాలా క్లియర్ గా చెప్పాడట.
షూటింగ్ కోసం తండ్రి ఆరోగ్యాన్ని రిస్క్ లో పెట్టడం ఏ మాత్రం ఇష్టం లేదని రామ్ చరణ్ చాలా క్లియర్ గా వివరణ ఇవ్వడంతో దర్శకుడు కొరటాల కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆచార్య షూటింగ్ మరింత ఆలస్యంగా స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.
50ఏళ్లకు పైబడిన వారిపై కరోనా చాలా ఈజీగా ప్రభావం చూపగలదని ఇప్పటికే ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. అందుకే సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటులు ఎవరు కూడా షూటింగ్స్ కి వెళ్లడం లేదని తెలుస్తోంది. ఇక మెగాస్టార్ లాంటి వారు కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నా రిస్క్ తప్పదని షూటింగ్స్ కి దూరంగా ఉంటున్నారు.