Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చిరంజీవి కొత్త సినిమా నుంచి మరో సర్ప్రైజ్: బోట్ పక్క గూస్బంప్స్ తెప్పించేలా సరికొత్త లుక్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి మెగాస్టార్ తో సినిమాలు చేస్తున్న నిర్మాణ సంస్థలు.. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు ఇప్పటికే వెలువడగా మరో రెండు సినిమాల్లో అధికారిక ప్రకటన రేపు పుట్టినరోజు సందర్భంగా వెలువడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
రీ ఎంట్రీ
ఖైదీ నెంబర్ 150 సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆ తర్వాత తాను ఎంతో ఇష్టపడి చేసే సైరా నరసింహారెడ్డి సినిమా కూడా పూర్తి చేశారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చాలా రోజుల క్రితమే మొదలుపెట్టినా కరోనా కారణంగా సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలు షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని మిగతా సినిమా అంతా షూటింగ్ పూర్తయిందని కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది.
లూసిఫర్ రీమేక్ షూటింగ్ లో
ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళం సూపర్ హిట్ సినిమా లూసిఫర్ రీమేక్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇక ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో 153 సినిమాగా చెప్పొచ్చు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటించారు. ఆయనకు సహాయం చేసే పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఇక ఆ పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నారని ప్రచారం జరుగుతూ ఉండగా మలయాళంలో మంజు వారియర్ నటించిన పాత్రలో నయనతార నటిస్తుందని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
మరో రెండు సినిమాల
అయితే తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న మరో రెండు సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈరోజు ఉదయం మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న వేదాళం రీమేక్ సినిమా కి సంబంధించిన ప్రకటన వచ్చింది. రేపు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అనౌన్స్మెంట్ ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మెహర్ రమేష్ వెనక్కు
అయితే ముందు నుంచి కూడా మెహర్ రమేష్ సినిమా 154వ సినిమాగా ఉండొచ్చని ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఈ రోజు ప్రకటించిన దానిలో అది ఎన్నో సినిమా అనే దాని మీద నిర్మాతలు ఎలాంటి ప్రకటన చేయలేదు.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా బాబీ సినిమా 154 సినిమాగా పేర్కొన్నారు.
Recommended Video
మెగా వేవ్ తీరానికి
రేపు చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ రాబోతోంది. మెగా వేవ్ తీరానికి చేరచ్చు అని వదిలిన ఈ అప్డేట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. రేపు అంటే ఆగస్టు 22 సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు ఈ మెగా వేవ్ రాబోతోందని తెలిపారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. పోస్టర్ లో ఉన్న బోట్ యాంకర్ టైడ్ అనడం చూస్తుంటే..ఇదేదో సముద్ర తీర ప్రాంతంలో జరిగే కథలాగే ఉందనిపిస్తోంది. అయితే ఈ సినిమా ముందుకు రావడంతో మెహర్ రమేష్ సినిమా వెనక్కు వెళ్ళే అవకాశం ఉంది.