Don't Miss!
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
మెగాస్టార్ పెద్ద మనవరాలి డ్యాన్స్ వీడియో వైరల్.. మాస్టర్ తో కలిసి ఆదరగొట్టేసింది!
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ తో పాటు సినిమా షూటింగ్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కొంత షూటింగ్ పనులు మిగిలి ఉండడంతో దర్శకుడు ఏమాత్రం గ్యాప్ లేకుండా పనులన్నిటినీ కూడా డిసెంబర్ నెలలోనే ఫినిష్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. అయితే ఈ సినిమాకు మరొకవైపు నుంచి ఊహించని విధంగా బజ్ అయితే పెరుగుతుంది.
ముఖ్యంగా సినిమాలోని బాస్ పార్టీ సాంగ్ కూడా ఇప్పటికే అంచనాలను మరింత పెంచేసింది. మాస్ కమర్షియల్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చడంతో తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని అర్థమవుతుంది. ఇక ఈ బాస్ పార్టీకి సంబంధించిన రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో కొంతమంది సెలబ్రిటీలు వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పెద్ద మనవరాలు కూడా బాస్ పార్టీ పాటకు అదిరిపోయేలా స్టెప్పులు వేసింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆమె ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో కలిసి చాలా అందంగా క్యూట్ గా స్టెప్పులు వేయడం ఫ్యాన్ ను కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల ఈ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి యూరోప్లో ఒక సాంగ్ షూటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సాంగ్ షూటింగ్లో ఆయన తన గ్రాండ్ డాటర్స్ ను కూడా వెంట తీసుకొని వెళ్లారు.
అక్కడ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఆధ్వర్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ఒక సాంగ్ షూట్ చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం హైదరాబాదులో కూడా మరొక షెడ్యూల్ కు సంబంధించిన షూటింగ్ కొనసాగుతోంది. వీలైనంత త్వరగా ఈ పనులన్నిటిని పూర్తిచేసుకుని అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఇదే నెలలో ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. మరోవైపు గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ కూడా చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా మాస్ దర్శకుడు బాబి డైరెక్ట్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.