Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
దేశంలో దొంగలు పడ్డారు.. చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్, అలీ తమ్ముడి సినిమా!
స్టార్ కమెడియన్ అలీ సమర్పణలో దేశంలో దొంగలు పడ్డారు చిత్రం వస్తోంది. అలీ తమ్ముడు కయ్యుమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. షాని పగడాల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నటుడు పృథ్వీ రాజ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలీ తన తమ్ముడి చిత్రానికి బాగా ప్రచారం కల్పించే బాధ్యతని తీసుకున్నాడు.
కయ్యుమ్ గతంలో కొన్ని చిత్రాల్లో కమెడియన్ గా నటించాడు. కానీ అలీ స్థాయిలో సక్సెస్ కాలేదు. తన తమ్ముడి కెరీర్ ని చక్కదిద్దే భాద్యత అలీ తీసుకున్నాడు. చిన్న చిత్రాల ప్రచార కార్యక్రమాలు చిరంజీవి, మహెష్ లాంటి స్టార్ హీరోల చేతుల మీదుగా ప్రారంభమైతే ఆ చిత్రాలు త్వరగా జనాల్లోకి వెళతాయి. దేశంలో దొంగలు పడ్డారు చిత్ర యూనిట్ కూడా అదే చేయబోతోంది.
ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ నేటి సాయంత్రం 6 గంటలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ తెలియజేసింది. గౌతమ్ రాజ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.