Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దేశంలో దొంగలు పడ్డారు.. చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్, అలీ తమ్ముడి సినిమా!
స్టార్ కమెడియన్ అలీ సమర్పణలో దేశంలో దొంగలు పడ్డారు చిత్రం వస్తోంది. అలీ తమ్ముడు కయ్యుమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. షాని పగడాల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నటుడు పృథ్వీ రాజ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలీ తన తమ్ముడి చిత్రానికి బాగా ప్రచారం కల్పించే బాధ్యతని తీసుకున్నాడు.
కయ్యుమ్ గతంలో కొన్ని చిత్రాల్లో కమెడియన్ గా నటించాడు. కానీ అలీ స్థాయిలో సక్సెస్ కాలేదు. తన తమ్ముడి కెరీర్ ని చక్కదిద్దే భాద్యత అలీ తీసుకున్నాడు. చిన్న చిత్రాల ప్రచార కార్యక్రమాలు చిరంజీవి, మహెష్ లాంటి స్టార్ హీరోల చేతుల మీదుగా ప్రారంభమైతే ఆ చిత్రాలు త్వరగా జనాల్లోకి వెళతాయి. దేశంలో దొంగలు పడ్డారు చిత్ర యూనిట్ కూడా అదే చేయబోతోంది.
ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ నేటి సాయంత్రం 6 గంటలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ తెలియజేసింది. గౌతమ్ రాజ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.