మోహన్ బాబు ఇంట్లో చోరీ.. పనిమనిషిపై అనుమానం!
సీనియర్ నటుడు మోహన్ బాబు నివాసంలో చోరీ జరిగింది. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఈ ఘటన జరగగా లక్షల్లో నగదు, ఆభరణాలు కనిపించకుండా పోయినట్లు ఆయన మేనేజర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమకు పనిమనిషి మీదే అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులని పట్టుకుని డబ్బు నగలు రికవరీ చేస్తాం అని అంటున్నారు. కానీ ఎంతమొత్తంలో డబ్బు, నగలు మిస్సయ్యాయో వివరించడం లేదు.

ఆ మధ్యన చిరంజీవి నివాసంలో కూడా ఇదే తరహా చోరీ జరిగింది. ఆ సమయంలో పోలీసులు చిరంజీవి నివాసంలో పనిచేస్తున్న వ్యక్తే చోరీకి పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు. తాజాగా జరిగిన చోరీపై మోహన్ బాబు కుటుంబ సభ్యులెవరూ స్పందించలేదు. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











