Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
అల్లు అర్జున్ కోసం సుకుమార్ కొత్త ప్లాన్: వాళ్లను కూడా దించబోతున్న డైరెక్టర్
గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ను అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీ ఇచ్చిన జోష్లో ఉన్న అతడు.. ఆ వెంటనే లెక్కల మాస్టారు సుకుమార్తో మరో సినిమాను ప్రకటించాడు. అదే పాన్ ఇండియా రేంజ్లో రూపొందుతోన్న 'పుష్ప'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రివేంజ్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దీని గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బటయకొచ్చింది.
'పుష్ప' సినిమాను తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. కాబట్టి అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను ఇందులో భాగం చేస్తున్నారు. ఇక, ఈ మధ్యనే దీన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని భావించిన నేపథ్యంలో.. ఈ చిత్రంలో మరింత ఎక్కువ మంది బాలీవుడ్ యాక్టర్లను నటింపజేస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే పలువురు స్టార్లతో చిత్ర యూనిట్ చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అందులో కొందరు ఈ సినిమాకు పచ్చజెండా కూడా ఊపారని అంటున్నారు. వీళ్లతో పాటు దక్షిణాది నటీనటులు కూడా రాబోతున్నారని టాక్.
భారీ బడ్జెట్తో రూపొందుతోన్న 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ 'పుష్పరాజ్' అనే గంథపు చెక్కల స్మగ్లర్గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు డీ గ్లామర్ లుక్తో కనిపించబోతున్నాడు. అదే సమయంలో లారీ డ్రైవింగ్, చిత్తూరు యాస సహా ఎన్నో నేర్చుకున్నాడు. ఇక, ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. అలాగే, మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్గా చేస్తుండగా.. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రను పోషిస్తోంది. ఇక, దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మిస్తోంది.